హైదరాబాద్ ఎయిర్పోర్టుకు బెదిరింపు మెయిల్స్: ఐటీ ఉద్యోగి అరెస్ట్
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పదే పదే బెదిరింపు మెయిల్స్ పంపుతున్న నిందితుడిని ఎయిర్పోర్ట్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీగా గుర్తించారు. కాగా, కోవిడ్ కారణంగా ఐటీ ఉద్యోగం పోయి డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్స్ పంపుతున్నాడు. గతంలో రెండుసార్లు విమానాల్లో హైజాకర్లు వచ్చారని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు మెయిల్స్ పంపాడు నిందితుడు. ఆ మెయిల్స్ కారణంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ఆ మెయిల్ను పరిశీలించగా ఇంటర్నేషనల్ డిపార్చర్ గేట్లు తెరవద్దని అందులో బాంబు పెట్టామని ఉంది. ఈ క్రమంలో విమానాశ్రయం సిబ్బంది ఆర్టీఐఏ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించారు.
ఆ మెయిల్స్ అన్నీ నకిలీవని తేలడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. బెంగళూరులో వైభవ్ను అరెస్ట్ చేశారు. కాగా, పలుమార్లు శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు కాల్స్ వచ్చని విషయం తెలిసిందే.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications