ఫేస్బుక్ పరిచయం: మహేష్ బాబు పేరు చెప్పి బోల్తా కొట్టించాడు
హైదరాబాద్: ఫేస్బుక్ ద్వారా మోసం చేస్తున్న నేరగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకొని నమ్మించి నిండా ముంచుతున్నారు. శశి అనే వ్యక్తి ఏకంగా హీరో మహేష్ బాబు పేరును ఉపయోగించి మోసం చేశాడు.
సినీ హీరోల ఇమేజ్ని తన మోసానికి వాడుకున్నాడు. తనకు మహేష్ బాబు చాలా సన్నిహితుడని, అతనిని కలిసేలా చేస్తానని ఫేస్బుక్ ద్వారా చెప్పి, బంజారాహిల్స్లో పలువురిని మోసం చేశాడు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

తాను మహేశ్ బాబును కలిపిస్తానని, సినిమా కథ, పాటలు వినిపించే అవకాశం కల్పిస్తానని ఓ బాధితుడిని నమ్మించి, అతని నుంచి రూ.5000 తన అకౌంట్లో వేయించుకున్నాడు. డబ్బులు అకౌంట్లో వేసిన తర్వాత బాధితుడు ఫోన్ చేస్తే శశి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
కారు బోల్తా: ముగ్గురికి గాయాలు
రాజేంద్రనగర్ నార్సింగి ఔటర్ రింగ్రోడ్డుపై కారు బోల్తాపడింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు ఉంచి గచ్చిబౌలికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications