కార్పోరేట్కు కొమ్ముకాస్తున్న కేసీఆర్.. ప్రజలు ఉద్యమించాలి: మావోయిస్టు లేఖ
కేంద్రం తరహాలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని మావోయిస్టు కమిటీ మండిపడింది.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిని మావోయిస్టు కమిటీ నిరసిస్తోంది. అరచేతిలో బంగారు తెలంగాణను చూపిస్తూ.. కార్పోరేట్ కంపెనీలకు కేసీఆర్ కొమ్ముకాస్తున్నారని మావోయిస్టు కమిటీ తీవ్ర విమర్శలు చేసింది.
భూసేకరణ పట్ల ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ.. పేదల నుంచి బలవంతంగా భూములను తీసుకుని వాటిని కంపెనీలకు ధారాదత్తం చేసేందుకే 2016 భూ సేకరణ చట్టాన్ని తీసుకొచ్చారని కేసీఆర్ పై మావోయిస్టు కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మీడియాకు మావోయిస్టు కమిటీ ఓ లేఖను విడుదల చేసింది.

పేద వర్గాలకు భూమి లేకుండా చేయాలని చూస్తున్న ప్రభుత్వంపై ప్రజలంతా పోరాటం చేయాలని లేఖలో మావోయిస్టు కమిటీ పిలుపునిచ్చింది. అభివృద్ధి పేరిట కార్పొరేట్ కంపెనీలకు ఎర్రతివాచీని పరుస్తున్నారని కమిటీ ఆరోపించింది.
ఏపీ ప్రభుత్వ వైఖరి కూడా మావోయిస్టు పార్టీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం తరహాలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని మండిపడింది. కొత్త భూసేకరణ చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టుగా లేఖలో కమిటీ పేర్కొంది. కొత్త చట్టాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాల్సిందిగా మావోయిస్టు కమిటీ డిమాండ్ వేసింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications