Telangana: మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం
Telangana: హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో రాష్ట్ర సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది.
నూతన క్యాంపస్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థకు హైదరాబాద్ తో సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని సీఎం తెలిపారు. మైక్రోసాఫ్ట్ కృషితో 500 పాఠశాలల్లో కృత్రిమ మేధ(ఏఐ)ని వినియోగిస్తూ బోధన కొనసాగుతోందని చెప్పారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్ షిప్ కు సీఎం ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్ లో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే మైక్రోసాఫ్ట్ భారత్ కు వచ్చి 25 వసంతాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ క్రియేట్ చేసిందన్నారు. మా ప్రభుత్వం సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తోందని గర్వంగా చెబుతున్నామని ఆయన అన్నారు. ఈ కేంద్రం ఏఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందని సీఎం చెప్పారు. ఆవిష్కరణల పట్ల మైక్రోసాఫ్ట్ నిబద్ధత.. మా తెలంగాణ రైజింగ్ విజన్ కు తోడవుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
-
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
సీఎం గారు లక్షమందిని కాపాడండి.. రేవంత్ రెడ్డికి వినూత్న విజ్ఞప్తి! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications