ఒక్కొక్కరు 10ఓట్లు వేసి గెలిపించాలి.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల రచ్చ
తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ లోక్సభ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో గెలుపుపైనే దృష్టిపెట్టిన రాజకీయపార్టీలు ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కోసం దూకుడుగా ముందుకు వెళుతున్నాయి. ఇక ఎన్నికలలో మళ్ళీ మెజార్టీ స్థానాలు సంపాదించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు తమ వంతు సహకారం అందించాలని ప్రయత్నం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచార పర్వాన్ని జోరుగా సాగిస్తున్నారు.
మెదక్ లో కాంగ్రెస్ రోడ్ షో
ముఖ్యంగా రేవంత్ రెడ్డి అన్ని లోక్ సభ స్థానాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని పెంపొందించడం తో పాటు, ప్రజల మద్దతు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక తాజాగా ఇదే క్రమంలో మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొండా సురేఖ వ్యాఖ్యలు
ఈ రోడ్ షోలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోడ్ షో లో మాట్లాడిన కొండా సురేఖ బీసీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ ఉన్న బీసీలందరూ ఒక్కొక్కరు 10ఓట్లు వేస్తే మన నీలం మధు విజయం సాధిస్తారని వ్యాఖ్యలు చేశారు . ఒక్కొక్కరు 10ఓట్లు వేసి నీలం మధుని గెలిపించాలని కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
10 దొంగ ఓట్లు వేసైనా సరే గెలిపించండి!
— Telugu Scribe (@TeluguScribe) May 2, 2024
ఒక్కొక్కరు 10 ఓట్లు వేసి నీలం మధును గెలిపించాలి - మంత్రి కొండా సురేఖ pic.twitter.com/6VIWMTJYo7
దొంగ ఓట్లు వేయమని కొండా సురేఖ చెప్తున్నారన్న ప్రత్యర్థి పార్టీలు
అయితే మంత్రి కొండా సురేఖ దొంగ ఓట్లు వేయమని బీసీలను ప్రోత్సహిస్తున్నారని, ఒక్కొక్కరు ఒక్క ఓటు మాత్రమే వేయగలరని, ఒక్కొక్కరిని 10 ఓట్లు వేయమన్నారు అని ప్రత్యర్థి పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. దొంగ ఓట్లు వేయడానికి కొండా సురేఖ బహిరంగంగా ప్రోత్సహిస్తున్నారని , 10 దొంగ ఓట్లు వేసి అయినా సరే గెలిపించాలని కోరుతున్నారని ప్రచారం చేస్తున్నారు.
బీసీలను ఉద్దేశించి కొండా సురేఖ వ్యాఖ్యల ఉద్దేశం ఇదే .. కాంగ్రెస్ క్లారిటీ
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం అది కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. కొండ సురేఖ బీసీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలలో ఒక్కొక్కరు పదిమందితో ఓట్లు వేయించాలి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో భాగంగా ఒక్కొక్కరు 10 ఓట్లు వేయాలని పొరబాటుగా అన్నారని, అంతేతప్ప సురేఖ వ్యాఖ్యల్లో మరే ఇతర ఉద్దేశం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. మొత్తానికి కొండా సురేఖ తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సమయంలో దుమారంగా మారాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications