60 లక్షల మంది సైన్యం ఉంది, జాగ్రత్త, బీజేపీ నేతలకు కేటీఆర్ వార్నింగ్
మునుగోడు బై పోల్కు సర్వం సిద్దమైంది. ఎన్నికల కమిషన్ అన్నీ ఏర్పాట్లు చేసింది. నిన్నటితో ప్రచారం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే మునుగోడులో గల పల్లివెల మండలంలో బీజేపీ- టీఆర్ఎస్ నేతల మధ్య దాడి జరిగిన సంగతి తెలిసిందే. గాయపడ్డవారిని మంత్రి కేటీఆర్ ఇవాళ పరామర్శించారు. ఈ క్రమంలో బీజేపీ నేతల తీరును తప్పుపట్టారు.
బీజేపీ నేత ఈటల రాజేందర్ అండ్ కో చేసిన దాడి కరెక్ట్ కాదని కేటీఆర్ అన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వర్ రెడ్డి ఇతరులపై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. రాళ్లు, కర్రలతో అటాక్ చేయడం ఏంటీ అడిగారు. దాడికి సంబంధించి ఫోటోలు, వీడియోలు ఉన్నాయని పేర్కొన్నారు. దాడి చేసి.. ఉల్టా మమ్మల్నే దాడి చేశారని అనడం కరెక్ట్ కాదన్నారు.

హింసకు తావు ఇవ్వని పార్టీ టీఆర్ఎస్ అని కేటీఆర్ స్పష్టంచేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలతోనే బీజేపీ నేతలు దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. బీజేపీ చిల్లర మల్లర రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శలు చేశారు. తమ పార్టీకి చెందిన నేతల రక్తాన్ని చవిచూశారని పేర్కొన్నారు.

ఈటల రాజేందర్ పీఏ దాడి చేయించారని కేటీఆర్ ఆరోపణలు చేశారు. దాడి చేసింది వారు, రెచ్చగొట్టింది వారు.. దాడి చేసి, సానుభూతి కోసం.. ఇతర విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీకి పిడికెంత మంది ఉన్నారని.. తమకు 60 లక్షలు మంది కార్యకర్తలు ఉన్నారని గుర్తుచేశారు. తాము శాంతియుత వాతావరణం కావాలని, అదే తమ ప్రాధాన్యం అని తెలిపారు. కానీ శాంతి వద్దు.. హింసకు పాల్పడతాం అంటే మీ ఇష్టం అన్నారు.
-
KTR on Speaker Decision: దానం, కడియంకు క్లీన్ చిట్టా ? కేటీఆర్ షాకింగ్ ..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications