Ponnam Prabhakar: ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం ప్రయాణం.. ప్రజలతో మాటముచ్చట..

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. మార్చి 3 ఆదివారం హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న TSRTC బస్సులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.మంత్రి నందిగామ నుంచి షాద్ నగర్ వరకు ప్రయాణించారు.
ప్రయాణ సమయంలో ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఉచిత ప్రయాణిస్తున్నారా అని అడిగారు.

మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే మరో వెయ్యి కొత్త బస్సులు వస్తున్నాయని ఎవరికి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. మంత్రి ఆసాంతం నిలబడే ప్రయాణించడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ పథకం కింది మహిళలు పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ ల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. బస్సు ఛార్జీల కోసం వాడే డబ్బును మహిళలు పొదుపు చేస్తున్నారని మంత్రి చెప్పారు.

Minister Ponnam Prabhakar traveled by RTC bus

కొత్త బస్సులు వస్తే టిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులు మరియు ప్రయాణికులపై ఒత్తిడి తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్‌తో మంత్రి మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పే రివిజన్ కమిషన్ (పిఆర్‌సి) అమలుపై చర్చ జరుగుతోందని మంత్రి తెలిపారు. బస్ బాడీలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియలు జరుగుతున్నాయని పొన్నం ప్రభాకర్ చెప్పారు.మంత్రితోపాటు ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి కూడా హాజరయ్యారని పత్రికా ప్రకటనలో తెలిపారు.

తమ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోపు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసిలో ఉచిత ప్రయాణం కల్పిందన్నారు. రూ. 10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ, రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. రైతు బంధు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు మంత్రి పొన్నం వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+