క్షమించండి: పొరపాటు జరిగిందంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీడియో
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్షమాపణలు చెప్పారు. ఇటీవల హైదరాబాద్లోని ముషీరాబాద్లో జరిగిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్.. బైంసా ఏఎంసీ ఛైర్మన్ రాజేష్ కుమార్ బాబును నెట్టేసిన ఘటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ వర్గానికి చెందినవారు పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టారు.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం మారేడుపల్లిలోని ఆయన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరణ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. జనం రద్దీ ఉన్న కార్యక్రమంలో అనుకోకుండా ఆయన బూటుతో తన కాలును తొక్కడంతో రక్తస్రావమైందని.. ఆ బాధలో ముందున్న వ్యక్తిని వెనక్కి లాగానని తెలిపారు.

అతను గిరిజనుడైన బైంసా ఏఎంసీ ఛైర్మన్ రాజేష్ కుమార్ బాబు అని తెలిసిందని, వెంటనే ఆయనకు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని క్షమాపణలు కూడా చెప్పానని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై అతనితోపాటు గిరిజన సమాజానికి క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ రోజున శ్రీ కేటీఆర్ గారు వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడింది.
— Talasani Srinivas Yadav (@YadavTalasani) August 25, 2023
ఓ వ్యక్తి నా కాలు తొక్కుతూ ముందుకెళ్లాడు.
నా కాలుకు గాయమై రక్తమొచ్చింది. ఆ సందర్భంగా నే ఆ వ్యక్తిని నెట్టి వేశాను.
సోషల్ మీడియాలో దీన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు.
అతను… pic.twitter.com/1a30RBFdZa
కొందరు కావాలనే సామాజిక మాధ్యమాల్లో విషయం పెద్దది చేసి చూపుతున్నారని మంత్రి తలసాని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, దళిత బిడ్డలు, వెనకబడిన వర్గాలు, మైనార్టీల గొంతుకని అని తెలిపారు. ఈ సంఘటనపై తనతో ఎమ్మెల్సీ దండె విఠల్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాలచారి తదితరులు మాట్లాడారన్నారు. ఎటువంటి బేషజం లేకుండా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications