హైదరాబాద్లో అత్యంత వైభవంగా మిస్ వరల్డ్ - 2025 పోటీలు ప్రారంభం..
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో 110కి పైగా దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు విశ్వసుందరి కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్ తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ప్రారంభోత్సవ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అత్యంత వైభవంగా నిర్వహించారు. 'జయజయహే తెలంగాణ' రాష్ట్ర గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 250 మంది కళాకారులు ప్రదర్శించిన పేరిణి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పరిచయ కార్యక్రమంలో వివిధ దేశాల సుందరీమణులు తమ ప్రత్యేక దుస్తులలో ర్యాంప్ వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఈ వేడుకకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్ 2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితర ప్రముఖులు హాజరయ్యారు.
Miss world 2025 Event starts in Hyderabad Telangana India #MissWorld2025 #cmtelangana #revanthreddy pic.twitter.com/31f6FX2mWH
— LN Talks (@LNTALKS12) May 10, 2025
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
బిగ్ షాక్: ఐదు చలాన్లు దాటితే అంతే సంగతి. మీ లైసెన్స్, ఆర్సీ కట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications