మిషన్ భగీరథ దేశానికి ఆదర్శం.!అక్టోబర్ 2న ఢిల్లీలో అవార్డు అందుకోబోతున్నామన్న మంత్రి హరీష్ రావు.!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ రెండు నాల్కల ధోరణి ఏంటని మంత్రి హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి మండిపడ్డారు. కేంద్ర మంత్రులకు ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే గతంలో సమకూర్చల్సిన 5300 కోట్లు విడుదలచేసి మాట్లాగాలని హితవు పలికారు. నీతి ఆయోగ్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అద్భుతమని, అందుకోసం 24 వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదిస్తే 24 పైసలు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
గుజరాత్ కు 2500 కోట్లు ఇవ్వడం జరిగిందని, గుజరాత్ లో 15 ఏళ్ల నుంచి మంచి నీటి సరఫరా అమలు చేస్తున్నాం అని చెబుతున్నప్పటికి 100 శాతం ఇంటింటికి నల్లాల ద్వారా నీళ్లు ఇవ్వడంలో గుజరాత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందన్నారు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు.

మిషన్ భగీరధకు ప్రతిష్టాత్మక అవార్డు..
కేంద్ర ప్రభుత్వం నేషనల్ జల్ జీవన్ మిషన్ ద్వారా మిషన్ భగీరథ పథకానికి, రాష్ట్ర ప్రభుత్వ పని తీరును ప్రశంసిస్తూ అక్టోబర్ 2వ తేదీన మీ రాష్ట్రానికి అవార్డు ఇస్తాం స్వీకరించడని కేంద్రం కోరడం జరిగిందని మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. ఇవాళ తెలంగాణ ప్రజలు గర్వించదగిన రోజని, తెలంగాణ పని తీరు దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వకారణంగా ఉందన్నారు.కేవలం ప్రశంసించడమే కాకుండా, అవార్డు స్వీకరించడంతో పాటు రాష్ట్ర పని తీరు జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి ఓ బూస్ట్ లా పని చేస్తుందని మంత్రులు స్పష్టం చేసారు.

ఇంటింటికి వందకు వంద శాతం నల్లా..
అంతే కాకుండా మహిళల కష్టాలను తీర్చడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేంద్రం గతంలో చెప్పిందని, అదే విషయాన్ని మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో తెలంగాణ నిరూపించిందని మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. కేంద్రం ఓ స్వచ్చంధ సంస్థ ద్వారా తెలంగాణలో 320 గ్రామాలను, 150 కి పైగా టీంలు పెట్టి రోజుల తరబడి పర్యవేక్షించి, లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ అవార్డును అందించేందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసిందన్నారు.
రెండు రోజులకో కేంద్ర మంత్రి వచ్చి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఈ అవార్డుతో అయినా వారికి కనువిప్పు కలగాలని, ఇప్పటికైనా బీజేపి నాయకులు కళ్లు తెరవాలన్నారు మంత్రులు.
తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వండి..
తెలంగాణ రాష్ట్ర పని తీరు అనేక పథకాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు. మిషన్ భగీరథ కార్యక్రమం హర్ ఘర జల్ కు ఆదర్శమయిందని అన్నారు. మిషన్ కాకతీయ దేశ వ్యాప్తంగా అమృత్ సరోవర్ కు ఆదర్శంగా మారిందని, రైతు బంధు ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన ఏకైక సీఎం చంద్రశేఖరావని అన్నారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణ దేశానికి దిక్చూచిగా నిలిచిందని, ఏడేళ్లలో అద్భుతాలు చేసి చూపిన రాష్ట్రం తెలంగాణ అని, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన ఏకైక నేత చంద్రశేఖర్ రావు అని మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేసారు.

బీజేపి ఢిల్లీలో అవార్డులు ఇస్తుంది..
అంతే కాకుండా కేవలం రెండేళ్లలో 59.94 టీఎంసీల నీటిని ఇంటింటికి ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదని, తెలంగాణ అధికారుల సమన్వయం, సమయస్పూర్తితోనే ఇది సాధ్యమయిందన్నారు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు. స్వచ్ఛ భారత్ కింద తెలంగాణ రాష్ట్రానికి ఏడు అవార్డులు వచ్చాయని, నిజామాబాద్ కు రెండు అవార్డులు వచ్చాయని, మొత్తం జాతీయ స్థాయిలో 13 అవార్డులు వచ్చాయన్నారు.
మిషన్ భగీరథతో 14 అవార్డులు వచ్చాయని,
తెలంగాణలో జరిగే అభివృద్ధి ప్రతీ మీటింగ్ లో కేంద్ర స్థాయిలో అభినందనలు వస్తున్నాయన్నారు. అవార్డులు ఇవ్వడమే కాకుండా రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరుతున్నామని, నిధుల కేటాయింపు అంశంలో చాలా సార్లు మోసం చేశారని మంత్రులు మండిపడ్డారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications