నన్ను క్షమించండి.. దానికి చింతిస్తున్నా: చేతులు జోడించి వేడుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
బెల్లంపల్లి: సాక్షి జర్నలిస్టు ఆంజనేయులుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్షమాపణలు చెప్పారు. మీడియా ముఖంగా ఆయన చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు. నెన్నెల మండలంలో భూకబ్జాలపై ఆంజనేయులు కథనాలు రాసినందుకు ఎమ్మెల్యే ఆయన్ను దూషించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టుకు ఎమ్మెల్యే చిన్నయ్య క్షమాపణలు చెప్పారు.
ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పాత్రికేయ వర్గాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. దీంతో ఎట్టకేలకు ఎమ్మెల్యే దిగిరాక తప్పలేదు. బెల్లంపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన క్షమాపణలు చెప్పారు.

సాక్షి ప్రతినిధిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. మనసులో ఉన్న బాధను జర్నలిస్టులతో పంచుకునే క్రమంలో ఒకటి రెండు వ్యాఖ్యలు తప్పుగా దొర్లాయని ఆయన అన్నారు. ఆ వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, ఇకపై ఇలాంటివి రిపీట్ కావని హామి ఇచ్చారు. ఎవరిని నొప్పించవద్దనేదే తన ఉద్దేశమని అందుకే క్షమాపణలు చెబుతున్నానని వెల్లడించారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications