ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్దం..!?
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల పై చర్యల దిశగా సుప్రీం చేసిన సూచనలతో స్పీకర్ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. వాటికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సమాధానాలు పంపారు. కాగా, పార్టీ మారిన వారి పైన చర్యల కోసం బీఆర్ఎస్ నేతలు తమ వద్ద ఉన్న ఆధారాలతో అసెంబ్లీ అధికారులను కలిసారు. ఇదే సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ కు సమాధానం ఇవ్వలేదు. న్యాయ నిపుణులతో చర్చలు చేస్తున్నారు. ఈ ఇద్దరు అవసరమైతే రాజీనామాకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతోంది.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కు చేరువైన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ నిర్దేశిస్తూ అసెంబ్లీ కార్యదర్శికి సూచనలు చేసింది. ఫలితంగా స్పీకర్ ఈ పది మందికి నోటీసులు జారీ చేసారు. వీరిలో ఎనిమిది మంది తిరిగి సమాధానం ఇచ్చారు. కాగా, అందులో ఆరుగురికి సంబంధించి స్పీకర్ మరో సారి స్పష్టత కోరుతూ తాజాగా నోటీసులు పంపారు. ఇక.. ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్ కు సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ ఇద్దరి విషయంలో న్యాయ నిపుణుల సూచనల మేరకు నడుచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దానం నాగేందర్, తన కుమార్తె కోసం కాంగ్రెస్ కు అనుకూల ప్రచారం చేసిన కడియం శ్రీహరి ఇప్పుడు తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. న్యాయ నిపుణుల సూచన మేరకు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలని డిసైడ్ అయినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దానం నాగేందర్ ఒక దశలో తన పదవికి రాజీనామా చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు.
అయితే, అందుకు సీఎం రేవంత్ అంగీకరించలేదు. మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో వారిచ్చిన సమాధానాలతో స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, దానం.. కడియం విషయంలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో.. ఈ ఇద్దరు రాజీనామా తప్పదనే వాదన వినిపిస్తోంది. దీంతో.. ఈ ఇద్దరి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications