మదర్ డెయిరీ పాల ధరలు పెంపు, రేపట్నుంచే అమల్లోకి
న్యూఢిల్లీ: మరో ప్రముఖ పాల పంపిణీ సంస్థ మదర్ డెయిరీ కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో పాల ధరను పెంచింది. లీటర్ ఫుల్ క్రీమ్ పాల ధరపై రూపాయి, టోకెన్ పాల ధరపై రూ. 2ల చొప్పున పెంచినట్లు మదర్ డెయిరీ ఆదివారం వెల్లడించింది.
పెరిగిన ధరలకు అనుగుణంగా లీటర్ టోకెన్ పాల ధర రూ. 48 నుంచి రూ. 50కి చేరింది. అర లీటర్ ఫుల్ క్రీమ్ పాల ధరను మాత్రం యథాతథంగా ఉంచింది. లీటర్ ఫుల్ క్రీమ్ పాల ధర రూ. 69 నుంచి 64కు పెంచింది. పెరిగిన ధరలు రేపటి(నవంబర్ 21) నుంచి అమల్లోకి వస్తాయని మదర్ డెయిరీ స్పష్టం చేసింది.

ఇన్పుట్ కాస్ట్ పెరిగిందని పేర్కొం టూ సోమవారం నుంచి ఢిల్లీ-ఎన్సీఆర్
మార్కెట్లో ఫుల్క్రీమ్ మిల్క్పై లీటరుకు రూ. 1, టోకెన్ పాల ధరలను
లీటరుకు రూ.2 చొప్పున పెంచాలని మదర్ డెయిరీ నిర్ణయిం ర్ణ చింది . రోజుకు 30 లక్షల లీటర్ల కంటే ఎక్కువ వాల్యూమ్లతో ఢిల్లీ-ల్లీఎన్సిఆర్లోని ప్రముఖ పాల సరఫరాదారులలో ఒకటైన మదర్ డెయిరీ ఈ ఏడాది పాల ధరలను పెంచడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం.
మదర్ డెయిరీ ఫుల్క్రీమ్ పాల ధరలను లీటరుకు రూ. 64కు పెంచినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు.
కాగా, ఇప్పటికే విజయ, ఆమూల్, హెరిటేజ్ పాల ధరలను పెంచగా ఇప్పుడు మదర్ డెయిరీ కూడా అదే బాటలో నడిచింది. దీంతో సామాన్యులకు కొంత భారంగానే మారనున్నాయి ఈ పాల ధరల పెంపు












Click it and Unblock the Notifications