కోమటిరెడ్డికి తేల్చి చెప్పిన కొత్త ఇంఛార్జ్ ఠాక్రే - నోటీసులు చెత్త బుట్టలో..!?
తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇంఛార్జ్ వచ్చారు. వస్తూనే పార్టీలో పంచాయితీల పైన ఫోకస్ పెట్టారు. గతంలో ఇంఛార్జ్ గా వ్యవహరించిన మాణిక్కం ఠాకూర్ పైనే ఆరోపణలు..ఫిర్యాదులు చేయటంతో తెలంగాణ నేతల తీరు ఏంటో కొత్ ఇంఛార్జ్ కు ముందే క్లారిటీ వచ్చింది. దీంతో, హైదరాబాద్ లో కాలు పెట్టిన తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే వరుస సమావేశాలను నిర్ణయించారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ తో పాటుగా సీఎల్పీ నేత భట్టితోనూ సమావేశమయ్యారు. పలువురు సీనియర్లు కలిసారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ భేటీలో ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

ఠాక్రే తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. గాంధీ భవన్ కు రావాలంటూ బుధవారం స్వయంగా ఠాక్రే ఎంపీ కోమటిరెడ్డికి ఫోన్ చేసారు. తాను గాంధీ భవన్ కు రాలేనని.. బయట కలుస్తానని వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఈ రోజు ఠాక్రేతో కోమటిరెడ్డి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు. ప్రధానంగా రేవంత్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు..ఎవరినీ కలుపుకుపోవటం లేదని ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ కమిటీల్లోనూ తనతో పాటుగా టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పినట్లుగా తెలుస్తోంది.

రేవంత్ నాయకత్వంతోనే సమస్య..!
తాను ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సమావేశమైన సమయంలోనూ తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను వివరించానని చెబుతూ మరోసారి అవే అంశాలను ఠాక్రేతో పంచుకున్నట్లుగా సమాచారం. కోమటిరెడ్డి చెప్పిన అన్ని అంశాలను విన్న ఠాక్రే కీలక హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే ఏం చేయాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్న సీట్లు వస్తాయి.. ప్రత్యర్ది పార్టీలను ఎదుర్కోవటంలో ఎక్కడా వెనకబడ్డామనే అంశాల పైన వీరిద్దరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, పార్టీలో యాక్టివ్ గా ఉంటూ పని చేయాలని కొత్త ఇంఛార్జ్ ఠాక్రే ఎంపీ కోమటిరెడ్డికి స్పష్టం చేసారు. ప్రజల్లో ఉండాలి యుద్దం చేయాలని సూచించారు.

నోటీసులు చెత్త బుట్టలోకి
ఆ భేటీ తరువాత కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తుబట్టలో పడ్డాయని చెప్పుకొచ్చారు.పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనని అన్నారు. ఆరేడుసార్లు ఓడిపోయినవాళ్లున్న పీఏసీలో తాను కూర్చోవాలా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం తాను సూచనలు చేసినట్లు వెల్లడించారు. ఇంఛార్జ్ తో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందన్నారు. ఇక నోటీసులు..ఫొటో మార్ఫింగ్ అంశాలు క్లోజ్ అయినట్లేనని వ్యాఖ్యానించారు. కొత్త ఇంఛార్జ్ రావటంతో కోమటిరెడ్డి తిరిగి పార్టీలో యాక్టివ్ గా ఉంటారా..లేక ఇదే తరహాలో కొనసాగుతారా అనేది చూడాల్సి ఉంది.
-
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications