తెలంగాణలో మోగనున్న "పురపోరు" నగారా.. నేడు షెడ్యూల్కి ఛాన్స్..?
తెలంగాణలో మరోసారి ఎన్నికల హీట్ పెరగనుంది. ఇప్పటికే జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా.. హోరాహోరీగా సాగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు పొందిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిచి తొలి స్థానంలో నిలవగా, బీఆర్ఎస్ రెండో స్థానం, బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. కాగా గ్రామ స్థాయిలో ప్రశాంతంగా ముగిసిన ఈ ఎన్నికల తర్వాత ఇప్పుడు పట్టణ రాజకీయాలకు తెరలేచే సమయం వచ్చింది.
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల షెడ్యూలును రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) మంగళవారం సాయంత్రం విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఎలాంటి సాంకేతిక లేదా పరిపాలనా అడ్డంకులు లేకపోతే షెడ్యూలు విడుదల ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ ఈరోజు ( జనవరి 27, 2026 ) ఉదయం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన భద్రతా చర్యలు, పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది వినియోగం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో సమావేశమై ఎన్నికల ప్రక్రియపై తుది చర్చ జరపనున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 15లోపు మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కలెక్టర్లు సమర్పించిన నివేదికల ప్రకారం, ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించడానికి, 13న ఓట్ల లెక్కింపు చేపట్టడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది నియామకాలు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే ఎన్నికల షెడ్యూలు వెలువడనుందనే అంచనాతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మహబూబ్నగర్, రామగుండం వంటి ప్రధాన కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరోవైపు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రామాల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా పార్టీల బలాబలాలు స్పష్టమయ్యాయని, అదే ఊపు పట్టణాల్లోనూ కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు బాధ్యతలు చేపట్టడంతో, స్థానిక స్థాయిలో పార్టీ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాక కొంత వెనకబడిన పార్టీలు, మున్సిపల్ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక, కూటములు, స్థానిక సమీకరణలపై పార్టీల్లో అంతర్గత చర్చలు ముమ్మరమయ్యాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో తెలంగాణ అంతటా మరోసారి ఎన్నికల కోలాహలం తప్పదనే పరిస్థితి కనిపిస్తోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications