నా పైసలతోనే నేను యాగం చేసుకుంటే నీకేం నొప్పి : సీఎం కేసీఆర్
నా పైసలతోనే నేను యాగం చేసుకుంటే ప్రధానికేమి ఇబ్బంది , ఆయన కూడ యాగానికి వస్తే ఇంత ప్రసాదం ఇచ్చే వాడినని అన్నారు సీఎం కేసిఆర్ నిర్మల్ జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం సభలో పాల్గోన్నారు, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ,బీజేల పై ఆయన విరుచుకుపడ్డారు.

దేశంలోనే చరిత్రాత్మకమైన రెవెన్యూ చట్టం : సీఎం కేసీఆర్
ఈనేపథ్యంలోనే దేశం మొత్తం ఆశ్చర్యపడేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తామని సీఎం కేసీఆర్ నిర్మల్ ఎన్నికల సభలో అన్నారు. ఎన్నికల తర్వాత భూముల సమస్యలు పరిష్కారం కోసం ప్రతి జిల్లాకు రెండు మూడు రోజుల క్యాంప్ వేస్తామని ప్రకటించారు.ఈ క్యాంప్ సీఎస్ నుండి మంత్రులు ,అన్ని స్థాయిల అధికారులు పాల్గోంటారని అన్నారు.గ్రామంలో ఎలాంటీ భూముల సమస్య ఉన్నా వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి గుంట లెక్కలు తేలేలా రైతులకు పూర్తి యాజమాన్య హక్కులను కల్పిస్తామని చెప్పారు. ఇందులోభాగంగానే పోడు రైతులకూడ మిగతా రైతుల లాగే లభ్ది చెందాలని ఆయన అన్నారు.వారి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. మరోవైపు దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మరోవైపు దేశంలో కూడ ఎక్కడా లేని విధంగా బీడీ కార్మీకులకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.

మోడి వస్తే ప్రసాదం పెట్టే వాడిని ...
కాగా ప్రధాని మోడి తన స్థాయిని మరచి విమర్శలు దిగుతున్నారని ,అలాంటీ పీఎమ్ నేను ఎప్పుడు చూడలేదని విమర్శించారు. ప్రధాని స్థాయిలో ఏదైన పాలసీలపై చర్చించాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్టని అన్నారు. దీంతో తాను చేస్తున్న యాగలపై మోడి వ్యాఖ్యలకు పై ఆయన ఘటుగా స్పందించారు.ఈనేపథ్యంలోనే నా డబ్బులతో నేను యాగం చేసుకుంటే మోడికి ఏ నష్టం జరిగిందని ప్రశ్నించారు.కాగా నా నాయాగానికి మోడి కూడ వస్తే ప్రసాదం పెట్టేవాడినని ఎద్దేవా చేశారు.కాగా దేశంలో ప్రజలను విభజిస్తూ పార్టీలు మా

కేంద్ర బడ్జెట్ కంటే తెలంగాణ బడ్జెట్ ఎక్కువ
దేశం అభివృద్ధి చెందాలంటే మహిళలకు ,దళితులకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని కోరారు. దేశంలో ఉన్న 70 వేల టీఎంసీల నీటిని వాడుకోవడం కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు చేత కావట్లేదని విమర్శించారు. పనికొచ్చే అంశాలపై చర్చించే పార్టీలే లేవని భాజపా, కాంగ్రెస్ పార్టీలను ఆయన విమర్శించారు. దేశ వ్యవసాయ, ఆర్థిక అంశాలు ఎలా ఉన్నాయన్న అంశాలపై చర్చించకుండా వ్యక్తిగత అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని మండిపడ్డారు. ‘ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి ఏడాది తెలంగాణలో 30 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని. ఇది కేంద్ర బడ్జెట్ కంటే రూ.3 లక్షల కోట్లు ఎక్కువగా ఎక్కువని చెప్పారు. కేంద్రంలో మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వమే వస్తుందని, తెలంగాణ మాత్రమే కాకుండా దేశం కూడా అభివృద్ధి చెందాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
-
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications