'పోలీస్' అభ్యర్ధులకు శుభవార్త: 5కే రన్ను రద్దు చేసే యోచనలో టీ సర్కార్
హైదరాబాద్: సచివాలయంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసు ఉద్యోగాల భర్తీలో వయోపరిమతి పెంపుపై ఈ సమావేశంలో చర్చించారు.
అంతేకాదు త్వరలో మొదలుకానున్న కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో 5కే రన్ను తొలగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు హోం మంత్రి నాయిని నేతృత్వంలోని మంత్రి వర్గ ఉప సంఘం 5కే రన్ ను తొలగించాలని ప్రతిపాదించింది.

త్వరంలో తెలంగాణలో పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు జరగనున్నాయి. కానిస్టేబుల్ పోస్టును దక్కించుకోవాలంటే ఐదు వేల కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంది. ఈ క్రమంలో కొంత మంది అభ్యర్ధులు స్పృహ తప్పి ఆసుపత్రి పాలైన సంఘటన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
దీనిపై త్వరలో జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఉగ్రవాదులు, తీవ్రవాదుల దాడుల్లో నష్టపోయిన వారికి పరిహారం పెంపుపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్, డీజీపీ ఉన్నతాధికారుుల హాజరయ్యారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications