'పోలీస్' అభ్యర్ధులకు శుభవార్త: 5కే రన్ను రద్దు చేసే యోచనలో టీ సర్కార్
హైదరాబాద్: సచివాలయంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసు ఉద్యోగాల భర్తీలో వయోపరిమతి పెంపుపై ఈ సమావేశంలో చర్చించారు.
అంతేకాదు త్వరలో మొదలుకానున్న కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో 5కే రన్ను తొలగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు హోం మంత్రి నాయిని నేతృత్వంలోని మంత్రి వర్గ ఉప సంఘం 5కే రన్ ను తొలగించాలని ప్రతిపాదించింది.
త్వరంలో తెలంగాణలో పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు జరగనున్నాయి. కానిస్టేబుల్ పోస్టును దక్కించుకోవాలంటే ఐదు వేల కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంది. ఈ క్రమంలో కొంత మంది అభ్యర్ధులు స్పృహ తప్పి ఆసుపత్రి పాలైన సంఘటన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
దీనిపై త్వరలో జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఉగ్రవాదులు, తీవ్రవాదుల దాడుల్లో నష్టపోయిన వారికి పరిహారం పెంపుపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్, డీజీపీ ఉన్నతాధికారుుల హాజరయ్యారు.