ట్విస్ట్: రాజీనామాను వ్యతిరేకించను, సమర్థించను: సుఖేందర్రెడ్డి
రాజీనామాపై వ్యతిరేకించను, సమర్థించనని నల్గొండ ఎంపీ సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.రాజీనామాపై సీఎం నిర్ణయం తీసుకొంటారని చెప్పారు సుఖేందర్ రెడ్డిరాష్ట్ర రైతుల సమన్వయ కమిటీపై మూడు ప్రత్యామ్నాయాలపూ సిఎ
హైదరాబాద్: నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వేదాంత ధోరణిలో మాట్లాడారు. రాజీనామా విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్దే తుది నిర్ణయమని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.
నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. సుఖేందర్రెడ్డిని రైతు సమన్వయ సమితి కన్వీనర్గా నియమించిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం టిఆర్ఎస్ వర్గాల్లో ఉంది.

అయితే ఈ విషయమై సుఖేందర్రెడ్డి మాత్రం ఇంతవరకు నోరు మెదపలేదు. శుక్రవారం నాడు పాడి పరిశ్రమ అభివృద్ధిపై మంత్రి తలసాని నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై మొదటిసారిగా స్పందించారు. తాను రాజీనామా చేస్తున్నానని వచ్చిన వార్తలను సమర్థించను, వ్యతిరేకించను అని ఆయన వ్యాఖ్యానించారు.
తన రాజీనామా విషయంలో సీఎందే తుది నిర్ణయమని సుఖేందర్ రెడ్డి చెప్పారు. ఒకవేళ తాను రాజీనామా చేస్తే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున ఎవరు పోటీ చేస్తారన్న దానిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని కూడా అన్నారు. కాగా, రాష్ట్ర రైతుల సమన్వయ కమిటీపై ఉన్న మూడు ప్రత్యామ్నాయాలపై కేసీఆర్ చర్చిస్తున్నారని ఆయన అన్నారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications