BRS: బీఆర్ఎస్ మాజీలకు షాక్ల మీద షాక్లు..
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటంబం సభ్యులకు చెందిన రైస్ మిల్లుల్లో అధికారులు తనిఖీ చేశారు. రూ.70 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయం చేసినట్లు గుర్తించారు. అలాగే రూ.9 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా అధికారులు షాకిచ్చారు.
ర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి భార్య కూడా ఇలానే లోన్ తీసుకుని కట్టలేదు. దీంతో రుణం చెల్లించాలని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. తమ వద్ద తీసుకున్న రూ.20 కోట్ల రుణంతో పాటు వడ్డీ రూ.20 కోట్లు మొత్తం కలిపి రూ. 40 కోట్లు చెల్లించాలంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్మూర్లోని జీవన్ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. జీవన్ రెడ్డి తన భార్య పేరు మీద 2017లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.20కోట్లు రుణం తీసుకున్నారు. ఈలోన్ కు సంబంధించి ఇప్పటి వరకు వడ్డీ కాని, అస్సలు కాని చెల్లించలేదు.

ఇక మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ కేసు నమోదు అయింది. శామీర్ పేట ఎమ్మార్వోతోపాటు, మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో మల్లారెడ్డి ఎస్టీలకు చెందిన 47 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.












Click it and Unblock the Notifications