తెలంగాణకు దారుసలాం పాలన వద్దు...లాల్ దర్వాజా పాలన కావాలి: స్వామి పరిపూర్ణానంద
తెలంగాణలో దారుసలాం పాలన జరుగుతోందని...లాల్ దర్వాజా పాలన జరగాలని బీజేపీ నేత ప్రముఖ స్వామీజీ పరిపూర్ణానంద స్వామి అన్నారు. హిందుస్థాన్లో హిందువులకు చోటు లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు.తెలంగాణలో అలాంటివే రెండు కూటములు ఏర్పడ్డాయని చెప్పారు. మజ్లిస్తో కూడిన టీఆర్ఎస్ పార్టీ, టీడీపీతో కలిసిన కాంగ్రెస్ కూటమిలు కలిసి రాష్ట్రాన్ని అదోగతికి గురిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జీసస్ పాలన తీసుకొస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను స్వామి పరిపూర్ణానంద తీవ్రంగా ఖండించారు. ఇక కేసీఆర్ తన పాలనతో మళ్లీ నాటి నిజాం పాలన గుర్తుకు తీసుకొస్తున్నారని ఫైర్ అయ్యారు స్వామి పరిపూర్ణానంద.

ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు
వరంగల్లో సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న వృద్ధ పూజారిపై ఓ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి విచక్షణారహితంగా కొట్టి చంపారని... అదేమని ప్రశ్నిస్తే ఆవ్యక్తి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని చెబుతున్నారని పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఎలాంటి సమాజంలో బతుకుతున్నామని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు కోసం నేతలు రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. కేసీఆర్ పాలనలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని పరిపూర్ణానంద మండిపడ్డారు.

దారుసలేం పాలన వద్దు... లాల్ దర్వాజ పాలన కావాలి
మైనార్టీ రక్షణ కోసం పనిచేయడం కాదు... మెజార్టీ ప్రజల రక్షణ కోసం పనిచేయాలని ఇందుకోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని స్వామి పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. దారుసలేం కనుసన్నలలోనుంచి బయటకు రావాలని చెప్పిన పరిపూర్ణానంద లాల్ దర్వాజా కనుసన్నులలో పాలన జరగాలని కోరారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీల పొట్టను కొడుతారా అని ప్రభుత్వాన్ని పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పిన పరిపూర్ణానంద స్వామి డిసెంబర్ 7న మనసుతో ఓటు వేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు.

నేనే తెలంగాణ సీఎం అభ్యర్థి
తన గొంతు ప్రజలకు వినిపించేందుకే బీజేపీని ఎంచుకున్నట్లు స్వామి పరిపూర్ణానంద తెలిపారు. సీఎం అభ్యర్థి పరిపూర్ణానంద అని అంటున్నారని తను నిజంగానే సీఎం అభ్యర్థిని అని తెలిపారు. అయితే దీనికి బాష్యం మరోలా వివరించారు స్వామీజీ. తన దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ అని చెప్పారు. తన కోసం 500 మంది పోలీసులను, 30 పెట్రోలింగ్ వాహనాలను పెట్టారని అంత ఖర్చు పెట్టడం అవసరమా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దారుసలాంకే సలాం కొడుతూ మెజార్టీ ప్రజలను విస్మరిస్తోందని చెప్పారు.

నా ఫోన్ను ట్యాప్ చేస్తున్నారు
రానున్న ఎన్నికల్లో ప్రజలకు బీజేపీనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని జోస్యం చెప్పారు పరిపూర్ణానంద స్వామి. ఇప్పుడు హిందూ ఆలయాల్లో మైక్ శబ్దం వినపడితే కొడుతున్నారని చెప్పిన పరిపూర్ణానంద స్వామి... కొన్ని రోజుల తర్వాత ఇంట్లో గంట శబ్దం వినపడితే కత్తులతో దాడులు చేస్తారని చెప్పారు. మరోవైపు భవిష్యత్తులో తన కార్యాచరణ గురించి వివరిస్తానని చెప్పిన పరిపూర్ణానంద తన ఫోన్ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తోందని ఇప్పటికే కాంగ్రెస్ టీడీపీ వారు ధ్వజమెత్తారు. ఈ మధ్యనే తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరాం కూడా తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా స్వామి పరిపూర్ణానంద కూడా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications