ఆయిల్ ట్యాంకర్లో మంటలు: తప్పిన ముప్పు (పిక్చర్స్)
హైదారబాద్: సికిందరాబాద్ గోపాలపురం పోలీస్స్టేషన్లోని పెట్రోలు బంకు వద్ధ నిలుచున్న ఆయిల్ ట్యాంకర్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం వైఎంసిఏ ఎదురుగా ఉన్న పెట్రోలు బంకు సమీపంలో నిలిచి ఉన్న ఆయిల్ ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఇదిలావుండగా, కారులో నుంచి మంటలు చెలరేగిన సంఘటన పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బేగంపేటకు చెందిన వ్యాపారి రమేష్ కారును డ్రైవర్ రాజు మాదాపూర్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రాజీవ్గాంధీ సర్కిల్ వద్దకు రాగానే ఒక్కసారిగా కారు బాయినెట్లో నుంచి పొగలు చిమ్ముతూ మంటలు చెలరేగాయి.
దీంతో అప్రమత్తమైన రాజు కారును పక్కకు ఆపాడు. కారులో మంటలు వస్తున్న విషయాన్ని గమనించిన స్థానికుల సమాచారం మేరకు ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని నిర్మాణంలో ఉన్న భవనం నుంచి నీరు, రోడ్డుపై ఉన్న మట్టిని చల్లి మంటలను ఆర్పివేశారు. నడిరోడ్డుపై కారులో నుంచి మంటలు రావడంతో పంజాగుట్ట నుంచి బేగంపేట వైపుకు వెళ్లే దారిలో కొద్దిమేర ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ఆయిల్ ట్యాంకర్లో మంటలు
ఆయిల్ ట్యాంకర్లో మంటలు చేలరేగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురై సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఆయిల్ ట్యాంకర్లో మంటలు
ఆయిల్ ట్యాంకర్కరు మంటలు అంటుకునన సమాచారం అందడంతో రంగంలో దిగిన ప్యారడైజ్ ప్రాంత అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లను రప్పించి మంటలను ఆర్పారు.
ఆయిల్ ట్యాంకర్లో మంటలు
సికింద్రాబాదులోని గోపాల్పురం ఇన్స్పెక్టర్ రామచంద్రారెడ్డి సకాలంలో సంఘటనకు చేరుకుని, ఎలాంటి నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టారు.
ఆయిల్ ట్యాంకర్లో మంటలు
ఆయిల్ ట్యాంకర్లో ఎలా మంటలు చెలరేగాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఆయిల్ ట్యాంకర్లో మంటలు
అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్న సమయంలో దాదాపు రెండు గంటల పాటు సంగీత్ ధియేటర్ నుంచి ప్యాట్నీ వరకు ట్రాఫిక్కు అంతరాయమేర్పడింది.