రోడ్డుపై పిస్టల్.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
హైదరాబాద్: ఓ యువకుడు బైకుపై వేగంగా వెళుతున్నాడు. అతని బేజులోంచి ఓ పరికరం కిందపడింది. చప్పుడు రావడంతో రొడ్డు పక్కనే ఓ వ్యక్తి దానిని గమనించాడు. ఇది గమనించిన ఆ యువకుడు బైకును వేగంగా ముందుకు పొనిచ్చాడు.
రొడ్డు పక్కనే ఉన్న వ్యక్తికి తుపాకీ కనిపించింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దానిని స్వాధీనం చేసుకున్నారు. మాసాబ్ ట్యాంక్, అషుర్ ఖానా వీధిలో ఓ గుర్తు తెలియని యువకుడు బైకుపై వెళుతుండగా పిస్టల్ కింద పడింది.
స్ధానికుల సమాచారాంతో పశ్చిమ మండలం అదనపు డీసీపీ కేఆర్ నాగరాజు, ఆసిఫ్ నగర్ ఏసీపీ డి.శ్రీనివాస్, హుమాయున్ నగర్ ఇన్ స్పెక్టర్ ఎస్. రవీందర్, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ రాజు అక్కడికి చేరుకున్నారు.
అప్పటికే సంఘటనా స్ధలంలో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. తుపాకీని స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఎయిర్ పిస్టల్ అని తేలింది. ఇది ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.