బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు, మోదీ టీంలో తెలంగాణ నుంచి కీలక మార్పులు..!!

ప్రధాని మోదీ పాలనా- పార్టీ పరంగా పూర్తిగా ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తున్నారు. త్వరలో జరిగే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు... మోదీ 4.0 టార్గెట్ గా ఈ మార్పులు చేర్పులకు రంగం సిద్దం చేస్తు న్నారు. ప్రభుత్వంతో పాటుగా పార్టీలోనూ మార్పులు జరగనున్నాయి. పలువరు సీనియర్ల శాఖలు మారటంతో పాటుగా.. కొందరు మంత్రులకు ఉద్వాసన ఖాయంగా కనిపిస్తోంది. ఇక, తెలంగాణ నుంచి కేబినెట్ లో ఇన్ - అవుట్ పైనా దాదాపు స్పష్టత వస్తోంది.

కేంద్ర కేబినెట్ ప్రక్షాళన కసరత్తు తుది దశకు చేరుకుంది. బీజేపీ జాతీయ నూతన కార్యవర్గంతో పాటుగా కేబినెట్ లో మార్పుల దిశగా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం కేంద్ర మంత్రు లు ఇద్దరికి గవర్నర్ హోదా దక్కనుంది. 12 మందిని కేబినెట్ నుంచి తప్పించేందుకు రంగం సిద్దమైంది. కేంద్ర కేబినెట్ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందే జరగటం ఖాయమైంది. కేబినెట్ లో కొందరు సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక.. సీనియర్ల శాఖల్లోనూ మార్పులు జరగనున్నాయి.

pm-modi-may-induct-one-more-telangana-leader-into-union-cabinet-reports

మిత్రపక్షాలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కనుంది. ఇక, తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ప్రస్తుతం ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి పదవులు ఉండగా, రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా మూడో వ్యక్తికి అవకాశం కల్పించడం ద్వారా సామాజిక సమతుల్యత ను సాధించాలని అధిష్ఠానం యోచిస్తోంది.

ఉప ప్రధానిగా అమిత్ షా..? మోదీ నిర్ణయం వెనుక..!?
ఉప ప్రధానిగా అమిత్ షా..? మోదీ నిర్ణయం వెనుక..!?

తెలంగాణ నుంచి మార్పులు - చేర్పులు

మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకునేందుకు పలువురు సీనియర్ నాయకులు ఎవరి ధీమాతో వారు ఉన్నారు. ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, నగేశ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విషయంలోనూ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కిషన్ రెడ్డికి శాఖ మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ ను మంత్రిగా కొనసాగిస్తూ.. పార్టీలో నితిన్ నబీన్ టీంలోకి తీసుకొస్తారనే వాదన వినిపిస్తోంది. కాగా, కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే సామాజిక సమీకరణాల్లో భాగంగా డీకే అరుణకు ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది.

డీలిమిటేషన్ పై కొత్త ఫార్ములా, జమిలి ముహూర్తం ఫిక్స్ - మోదీ మార్క్ లెక్క..!!</a><a class=" title="డీలిమిటేషన్ పై కొత్త ఫార్ములా, జమిలి ముహూర్తం ఫిక్స్ - మోదీ మార్క్ లెక్క..!!" loading="lazy" width="100" height="56" />
డీలిమిటేషన్ పై కొత్త ఫార్ములా, జమిలి ముహూర్తం ఫిక్స్ - మోదీ మార్క్ లెక్క..!!

కాగా.. ఇప్పటికే ఓసీ, బీసీ వర్గాలకు కేంద్రంలో చోటు దక్కినందున, గిరిజన ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఆదిలాబాద్ ఎంపీ నగేశ్‌కు అవకాశం ఇస్తారని పార్టీ ముఖ్య నేతల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఎస్టీ వర్గాన్ని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో.. అదే వర్గానికి తెలంగాణ నుంచి అవకాశం కల్పిస్తారని ఢిల్లీ నేతల సమాచారం. అదే విధంగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేరు ప్రచారంలో ఉంది. ఇక.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం తనదైన శైలిలో గట్టి నమ్మకంతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో, తెలంగాణ కేంద్రంగా మోదీ నిర్ణయాల పైన పార్టీలో ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+