కెమికల్ కంపెనీలో విషవాయువులు లీక్, ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
నగరంలోని బాలానగర్ ఇండస్ట్రీ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక ప్రాంతంలోని బయోకెమికల్స్ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు విషవాయువులు పీల్చడం వల్ల మృతి చెందారు.
హైదరాబాద్: నగరంలోని బాలానగర్ ఇండస్ట్రీ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక ప్రాంతంలోని బయోకెమికల్స్ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు విషవాయువులు పీల్చడం వల్ల మృతి చెందారు.
కంపెనీలోని డ్రైనేజీని శుభ్రం చేసేందుకు ముగ్గురు కార్మికులు అందులోకి దిగిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైనేజి శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా విష వాయువులు వెలువడ్డాయి.

దీంతో ఊపిరాడక ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బయో కెమికల్స్ కంపెనీకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతులను మూసాపేట్ జనతానగర్కు చెందిన అల్లాడి రామారావు(50), అల్లాడి సీతారామ్(30)గా గుర్తించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications