Nagamani: నాగమణి హత్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రాయపోల్ లో జరిగిన మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు పరమేశ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా నిందితుడికి సహకరించిన వారి కోసం పోలీసులు బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రధాన నిందితుడు పరమేశ్ పై పోలీసులు బీఎన్ఎస్ 103 (1) సెక్షన్ కింద కేసు పెట్టారు. ఇబ్రహీంపట్నం రాయపోల్ కు చెందిన నాగమణికి ఒక అక్క, తమ్ముడు ఉన్నాడు. వారి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు.
దీంతో పెద్దనాన్న సహకారంతో వారు పెరిగి పెద్దయ్యారు. నాగమణికి 10 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఆ తర్వాత ఆమెకు 2020లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలోనే భర్తతో విభేదాల కారణంగా 2022లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకాంత్ ను ప్రేమించింది. అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కులాంతర వివాహం కావడంతో తమ్ముడు, అక్క ఒప్పుకోలేదు. దీంతో నవంబర్ 10న నాగమణి, శ్రీకాంత్ యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు.

అప్పటి నుంచి వారు సిటీలోనే ఉంటున్నారు. నాగమణి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధురు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం వీక్ ఆఫ్ కావడంతో తన ఇంటికి వెళ్తానని భర్త శ్రీకాంత్ కు చెప్పి శనివారం సాయంత్రం రాయపోల్ కు వెళ్లింది. ఆదివారం అక్కడే ఉండి.. సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లేందుకు రాయపోల్ నుంచి స్కూటీపై బయల్దేరింది. నాగమణి అనుసరిస్తూ తమ్ముడు పరమేశ్ కారులో వచ్చాడు. కారుతో స్కూటీకి డ్యాష్ ఇచ్చాడు.
దీంతో నాగమణి కింద పడిపోయింది. వెంటనే భర్తకు ఫోన్ చేసి తమ్ముడు తనను కారుతో ఢీకొట్టాడు. చంపడానికి ట్రై చేస్తున్నాడు అని చెబుతున్న క్రమంలోనే పరమేశ్ కత్తితో నాగమణి మెడపై వేటు వేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. నిందుతుడు అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. హత్య ఆస్తి గొడవలని చెబుతున్నారు. అయితే ఆస్తి గొడవల హత్య కాదని.. పరువు హత్య అని నాగమణి భర్త శ్రీకాంత్ చెప్పారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications