చాందినితో తిరిగాడు: నిందితుడి తండ్రి, ఆ ఇద్దరితో హోటల్లో హద్దు మీరి ఉంటుందనే హత్య
చాందినీని తన కొడుకు హత్య చేశాడని నిందితుడైన బాలుడి తండ్రి అంగీకరించాడని తెలుస్తోంది.
Recommended Video

హైదరాబాద్: చాందినీని తన కొడుకు హత్య చేశాడని నిందితుడైన బాలుడి తండ్రి అంగీకరించాడని తెలుస్తోంది. సర్.. ఈ వీడియోలో ఉన్నది మా వాడేనని, చాందినీతో కలిసి తిరిగేవాడని పోలీసులకు ఆయన చెప్పారు. నిందితుడు నేరాన్ని అంగీకరించకపోవడంతో సిసి ఫుటేజీని పోలీసులు తండ్రికి చూపించారు.
తన కుమారుడే ఆమెను చంపేశాడని ఆ తండ్రి కన్నీరు పెట్టుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో సీసీటీవీ కెమెరాలు కీలకంగా మారాయి. సుమారు 100 వరకు సీసీ ఫుటేజీలను జల్లెడపట్టారు. చివరకు కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలో నిందితుడు, చాందినీ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.

పదో తరగతి నుంచే మెలిగేవారు
చాందిని జైన్ హత్యలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. చాందిని బాచుపల్లి సిల్వర్ఓక్స్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. మదీనాగూడ ప్రగతి ఎన్క్లేవ్కు చెందిన నిందితుడు ఆమెతోపాటే పదో తరగతి వరకు చదివాడు. ఆ సమయంలో ఇద్దరు సన్నిహితంగా మెలిగేవారు.

మరో ఇద్దరితో సాన్నిహిత్యం నచ్చలేదు
అనంతరం నిందితుడు ఇంటర్లో కొంపల్లిలోని డీఆర్ఎస్ కళాశాలకు మారినా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగింది. అయితే చాందిని మరో ఇద్దరితో స్నేహంగా మెదులుతుండటం నిందితుడికి నచ్చలేదు. ఈ విషయాన్ని ఆమెకు చెప్పినా చాందిని అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగేది.

వదిలించుకోవాలని
చాందిని వైఖరి నచ్చని నిందితుడు ఆమెను శాశ్వతంగా వదిలించుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం తగిన స్థలం కోసం వెతుకుతూ గత ఆగస్టు 9న అమీన్పూర్ గుట్టల వద్దకు వెళ్లి చూసి వచ్చాడు. ఈ నెల 1-3 మధ్య నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో టర్డ్మన్ పేరుతో ఐరాస నమూనాపై విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరిగింది. నగరానికి చెందిన మరో ఇంటర్ విద్యార్థే దీనికి నిర్వాహకుడిగా వ్యవహరించాడు.

3రోజులు హోటల్లో కలిసి ఉండటంతో హద్దు మీరి ఉంటారని
హైదరాబాద్తోపాటు బెంగళూరు నుంచి 52 మంది విద్యార్థులు హాజరయ్యారు. అక్కడ నాగా, సాహిల్ అనే విద్యార్థులు చాందినికి పరిచయమయ్యారు. వారితో స్నేహం గురించి చాందిని నిందితుడి వద్ద ప్రస్తావించింది. మూడురోజులపాటు అందరూ కలిసి హోటల్లో ఉండటంతో వారు హద్దు మీరి ప్రవర్తించి ఉంటారని చాందినిపై నిందితుడు మరింతగా కక్ష పెంచుకున్నాడు.

చివరిసారి గంటన్నర సంభాషణ
హత్య జరిగిన రోజైన 9వ తేదీ సాయంత్రం 5.28 నిమిషాలకు మదీనాగూడ నుంచి నిందితుడితో కలిసి చాందిని ఆటోలో బయలుదేరింది. కొంతసేపటికే అమీన్పూర్ కూడలిలో దిగి నిర్మానుష్యంగా ఉండే గుట్ట ప్రాంతం వైపు వెళ్లారు. అక్కడ చివరిసారిగా గంటన్నర సేపు ఇద్దరి మధ్య సంభాషణ సాగింది.

పిడిగద్దులు, మెడపై బలంగా కొట్టడంతో
చాందిని ఇతరులతో సన్నిహితంగా ఉంటున్న విషయం మరోసారి ప్రస్తావనకు రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నిందితుడు ఆమె మొహంపై పిడిగుద్దులు గుద్దాడు. ఆమె పారిపోయేందుకు ప్రయత్నించగా తిరిగి పట్టుకొని మెడపై బలంగా కొట్టడం, గొంతు నులమడంతో చాందిని మృతిచెందింది. అనంతరం బండరాయి పైనుంచి కిందకు తోసేసి తాను వచ్చినదారిలో కాకుండా వేరే మార్గంలో అక్కడినుంచి పారిపోయాడు. ఆమె సెల్ఫోన్ను తీసుకెళ్లి సమీపంలోని చెరువులోకి విసిరేశాడు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications