Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ షర్మిల గెలిచేనా: జగన్ సన్నిహితుడికి పాలేరు కాంగ్రెస్ టికెట్..!!

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) వేడి పతాక స్థాయికి చేరుకుంది. ఎన్నికల ప్రచార జోరు పెరిగింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్తోన్నాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

Election Commission Announes Polling Dates for five state elections

ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా వెలువడింది. 45 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. కీలక నియోజవర్గాలు, అదే స్థాయిలో సీనియర్ల పేర్లు ఇందులో ఉన్నాయి. మధుయాష్కీ గౌడ్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహ్మద్ అజరుద్దీన్, పీ విజయారెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి.. వంటి సీనియర్ల పేర్లు రెండో జాబితాలో ఉన్నాయి.

Ponguleti Srinivasa Reddy to field from Congress against YS Sharmila at Palair

లోక్‌సభ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేరు కూడా ఈ జాబితాలో ఉంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గాన్ని కేటాయించింది కాంగ్రెస్. ఈ స్థానం నుంచి ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. కొద్దిరోజుల కిందటే ఆయన బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి, కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. పోటీ చేయదలిచిన నియోజకవర్గం కూడా ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాలేరు నుంచి పోటీ చేస్తానంటూ ఆమె చాలా సందర్భాల్లో ప్రకటించారు. అక్కడే పార్టీ కార్యాలయాన్నీ నిర్మించారు. వైఎస్ఆర్టీపీ ఖమ్మం జిల్లా రాజకీయ కార్యకలాపాలు పాలేరు కేంద్రంగా సాగుతున్నాయి.

Ponguleti Srinivasa Reddy to field from Congress against YS Sharmila at Palair

ఇదే స్థానం నుంచి పొంగులేటి రేసులో నిల్చోవడం ఆసక్తి రేపుతోంది. వైఎస్ కుటుంబానికి ఆప్తుడిగా పేరుంది పొంగులేటికి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్‌లో చేరబోయే ముందు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ను స్వయంగా కలిశారాయన.

గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచీ గెలిచారు. అలాంటి నాయకుడు వైఎస్ షర్మిల మీద పోటీకి దిగబోతోన్నారు. తెలంగాణలో రసవత్తరంగా మారబోయే అసెంబ్లీ ఎన్నికల పోరులో ఇక పాలేరు కూడా చేరినట్టయింది. ఇక్కడ గెలుపెవరిదనేది ఉత్కంఠతను రేపుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+