పూర్ణిమ కచ్చితంగా తిరిగొస్తుంది: ఇదీ ఆమె తల్లిదండ్రుల ఆవేదన.. ఆశ..
పూర్ణిమ సాయి కచ్చితంగా తిరిగి తమ వద్దకు వస్తుందని ఇప్పటికీ ఆమె తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: కడుపున పుట్టిన బిడ్డ తల్లిదండ్రులను వద్దంటున్నా.. కన్నవారు మాత్రం ఆమె రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పూర్ణిమ సాయి కచ్చితంగా తిరిగి తమ వద్దకు వస్తుందని ఇప్పటికీ ఆమె తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కుమార్తె ఇష్ట ప్రకారం నడుచుకుంటామని వారు పేర్కొనడం గమనార్హం.
మరోవైపు పూర్ణిమ సాయి మాత్రం ఇంటికి వెళ్లనంటే, వెళ్లనంటూ మొండికేస్తున్న సంగతి తెలిసిందే. తాను ముంబై వెళ్లడం ఇంత పెద్ద వివాదానికి దారి తీయడంతో.. తిరిగి తల్లిదండ్రులకు ముఖం చూపించలేకే పూర్ణిమ ఇలా వ్యవహరిస్తుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అదీ కాపోతే తల్లిదండ్రులను వద్దనుకునేంత బలమైన కారణమేంటి? అన్నది అంతుపట్టడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నింబోలి అడ్డాలోని బాలికాసదన్ లో ఉన్న పూర్ణిమను బుధవారం రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా బాలికా సంరక్షణ కమిటీ(సీడబ్ల్యూసీ) ముందు హాజరుపరచనున్నారు. బాలిక ఎక్కడ ఉండాలనేది కమిటీ నిర్ణయించనుంది.
తొలుత పూర్ణిమకు కౌన్సెలింగ్ కు నిర్వహించి.. అప్పటికీ ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు నిరాకరిస్తే.. ఆమెను హోంలోనే ఉంచే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సాయంత్రం లోగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
-
ఏడు రోజుల్లోనే ఆరు బ్యాంకుల్లో చోరీ.. కానీ దోచుకుంది మాత్రం..? -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు











Click it and Unblock the Notifications