కరెంట్ చార్జీల వాత.. ఈఆర్సీలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు.. ఎంత పెంచుతారంటే..
కరెంట్ బిల్లుల ఛార్జీల మోత మోగనుంది. ఇప్పటికే డిస్కంలు ప్రతిపాదనలు చేయగా.. సీఎం కేసీఆర్ కూడా అనుమతించరట. సో పవర్ బిల్లు మోత తప్పదు. ఇందుకు సంబంధించి ప్రకటన వెలువడటమే తరువాయిగా ఉంది. ఈఆర్సీ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. పేదలపై భారం పడకుండా చూడాలని కేసీఆర్ స్పష్టంచేశారని తెలుస్తోంది.
విద్యుత్కు సంబంధించిన సమస్యలపై ఆయన కేసీఆర్ తీశారు. విద్యుత్ ప్రాజెక్టుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, త్వరగా కొత్త విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తేవాలని ఆదేశాలు జారీ చేశారు. సోలార్ పవర్పై దృష్టి సారించాలని కోరారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు కేంద్రప్రభుత్వ విధానాలే కారణమం అని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. టన్నుకు 50 రూపాయలు ఉండే గ్రీన్ ఎనర్జీ సెస్ను రూ.400 లకు పెంచింది. దీంతో ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వంపై 7 వేల200 కోట్ల ఆదనపు భారం పడుతుంది.

బొగ్గు ధరలను ఆరు నుంచి పది శాతం పెంచడంతో డిస్కమ్లపై ప్రతి సంవత్సరం అదనంగా రూ.725 కోట్ల భారం పడుతోంది. గత నాలుగు ఏళ్లలో బొగ్గు రవాణా రైల్వే ఛార్జీలు 40 శాతం మేర పెరిగాయని చెబుతోంది. డిస్కమ్లపై భారాన్ని తగ్గించేందుకు విద్యుత్ ఛార్జీలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఛార్జీలు స్వల్పంగానే పెంచుతామని చెబుతోంది. ఎంతమేర పెంచుతారనే అంశానికి సంబంధించిన సమాచారం రెండు రోజుల్లో తేలనుంది.
పవర్ బిల్లులతో సామాన్య, మధ్య తరగతి జనం ఇబ్బందులు పడతారు. కరోనా వల్ల కొందరికీ ఉపాధి కూడా సరిగా లేదు. ఈ క్రమంలో బిల్లుల వాత ఏంటీ అని కొందరు అడుగుతున్నారు. మళ్లీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా భయపెడుతుంది. ఇంతలో బిల్లుల మోతపై పేద, మధ్య తరగతి వారు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications