అల్లూరి సీతారామరాజు పోరాటం ప్రత్యేకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంస
హైదరాబాద్: స్వాత్రంత్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం, దేశ భక్తి అసమానమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అల్లూరి సీతారామారాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ద్రౌపది ముర్ము మాట్లాడారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం వలే అల్లూరి సీతారామరాజు పోరాటం కూడా ప్రజల్లో స్ఫూర్తి నింపింది. మహానీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలి. అల్లూరి ఒక ప్రత్యేకమైన యుద్ధ నైపుణ్యంతో ఆంగ్లేయులపై పోరాటం చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా భీమరవంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతి వనాన్ని హైదరాబాద్ నుంచి రాష్ట్రపతి వర్చువల్గా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. గొప్ప త్యాగాలతోనే గొప్ప విజయాలు నమోదవుతాయని.. మన్యం వీరుడి పోరాటం అసాధారణమైదన్నారు. అమృత్ కాల్లో ఈ వేడుకలు జరగుతున్నాయన్నారు. ఓ జాతి కోసం అల్లూరి సీతారామరాజు పోరాడలేదని.. దేశం కోసం ఆయన పోరాడారని గవర్నర్ తెలిపారు. ఆంగ్లేయులను గడగడలాడించిన అల్లూరి పోరాటాన్ని మర్చిపోవద్దన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకే వర్గానికి పరిమితమైన వ్యక్తి అల్లూరి కాదన్నారు. సూర్య చంద్రులు ఉన్నంతవరకు విస్మరించలేని క్షత్రియ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అల్లూరి వీరుడు మాత్రమే కాదని.. వైద్యుడు, ఆధ్యాత్మిక వేత్త కూడా అని చెప్పారు. 125వ జయంతివేళ దేశం మొత్తం మన్యం వీరుడికి నివాళులర్పిస్తోందన్నారు.

మరోవైపు, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. అల్లూరి పోరాటంపై ప్రశంసలు కురిపించారు. ప్రజలమీద పీడన దోపిడీ విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో దైవాంశ సంభూతులు పుడతారని, 'సంభవావి యుగే యుగే ' అని గీతాచార్యుడు చెప్పిన మాటలు, 26 ఏండ్ల అతిపిన్న వయస్సులోనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి అమరుడైన అల్లూరి సీతారామరాజు జీవితానికి నిజంగా వర్తిస్తాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.
President Droupadi Murmu graced the closing ceremony of the 125th birth anniversary of Sri Alluri Sitarama Raju at Hyderabad. https://t.co/x8DUAwt7YI pic.twitter.com/CclpKHrg1e
— President of India (@rashtrapatibhvn) July 4, 2023
స్వేచ్ఛావాయువులు పీల్చుతూ స్వయం పాలన కోసం సాగిన స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి గొప్ప స్ఫూర్తిని రగిలించారని సీఎం అన్నారు. అల్లూరి స్ఫూర్తిని తెలిపే గీతాలను వింటూ తాను తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంతో స్ఫూర్తిని పొందానని సీఎం అన్నారు.
దేశ స్వాతంత్ర్యోద్యమంలో పోరాడి అసువులు బాసిన భగత్ సింగ్ వంటి గొప్ప వీరుల సరసన తెలుగునేల మీదనుంచి అల్లూరి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని సీఎం స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల నిర్వాహకులయిన క్షత్రియ సేవా సమితి ప్రతినిధులను సీఎం వేడుకల ముగింపు సందర్భంగా అభినందించారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications