ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరా మస్తాన్ విచారణ, కీలక సమాచారం..!!
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే రివ్యూ కమిటీలోని కీలక అధికారులను విచారణ చేసింది. అధికారుల నుంచి కీలక సమాచారం రాబట్టింది. ఇక..రాజకీయ నేతల విచారణకు సిట్ సమాయత్తం అవుతోంది. కాగా, ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ ను సిట్ ఫోన్ టాపింగ్ పైన విచారణ చేసింది. తన ఫోన్ 2000 వ సంవత్సరం నుంచి ట్యాపింగ్ అవుతున్నట్లు అనుమానించినట్లు మస్తాన్ వెల్లడించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థాపకుడు ఆరా మస్తాన్ను సిట్ విచారించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన నూతన సిట్ ఈ విచారణ ప్రారంభించింది. ఇప్పటికే రెండు సార్లు పోలీసులు ఆరా మస్తాన్ను ప్రశ్నించింది. ఈసారి విచారణలో భాగంగా ఆయన గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లను తిరిగి పరిశీలించి, కన్ఫర్మేషన్ కోసం అదే ప్రశ్నలను మరోసారి అడిగినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు 2020 సంవత్సరం నుంచి ఆరా మస్తాన్ వివిధ కీలక రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులతో మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ను సమగ్రంగా పరిశీలించారు. ఈ కాల్ డేటా ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? జరిగితే ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? అనే అంశాలపై సిట్ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సిట్ అధికారుల విచారణ అనంతరం ఆరా మస్తాన్ కీలక వ్యాఖ్యలు చేసారు. నూతనంగా ఏర్పాటు చేసిన సిట్ తనను ఈరోజు విచారణకు రావాలని పిలిచిందని అన్నారు. అధికారుల పిలుపు మేరకే తాను హాజరయ్యానని తెలిపారు.

కాగా, గతంలో అడిగిన ప్రశ్నలనే మరోసారి అడిగి, తన వాంగ్మూలాన్ని నిర్ధారించుకున్నారని వెల్లడించారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను స్పష్టమైన సమాధానాలు ఇచ్చానని చెప్పుకొచ్చారు. తన ఫోన్ ట్యాపింగ్ 2020 సంవత్సరం నుంచే జరుగు తోందన్న అనుమానం ఉందని తెలిపారు. అప్పటి నుంచి తన కాల్స్, కమ్యూనికేషన్పై నిఘా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అంశాన్ని విచారణలో సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ లినట్లు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిందని ఆరా మస్తాన్ అభిప్రాయపడ్డారు. గతంతో పోలిస్తే ఇప్పుడు విచారణ మరింత సమగ్రంగా, స్పష్ టంగా కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. నూతన సిట్ దర్యాప్తు ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరలోనే ఒక స్పష్టమైన దశకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సిట్ అధికారులు తనకు చెప్పారని అన్నారు. తాను చట్టపరమైన ప్రక్రియలకు పూర్తిగా సహకరిస్తానని, నిజాలు బయటకు రావాలన్నదే తన ఆకాంక్ష అని ఆరా మస్తాన్ స్పష్టం చేశారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications