ప్రజలే మాకు బాసులు, తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రజలే మాకు బాసులు, తమకు ఎవరు బాసులు లేరన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్,ఈనేపథ్యంలోనే ,జాతియ పార్టీలను ఓడించి టీఆర్ఎస్ కు పట్టం కట్టాలని ఆయన పిలుపినిచ్చారు ,జహిరాబాద్ ,నారయణఖేడ్ పార్లమెంట్ స్థానాలకు గాను ఆందోల్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గోన్నారు.
ఈసంధర్భంగా బీజేపీ,కాంగ్రెస్ పార్టీలపై ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లు పరిపాలించిన రెండు పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటూ, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు.రెండు పార్టీలు ప్రజలకు కనీస మౌలిక సదుపాయలు కల్పించలేదని దుయ్యబట్టారు. ఈనేపథ్యంలోనే తెలంగాణ మరింత అభివృద్ది జరగాలంటే టీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.

కాగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లి నియోజకవర్గాలకు గాను ఏడు లక్షల ఎకారాల నీటీని అందిస్తానని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు.ఇక తెలంగాణ ఏర్పడి,టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే రైతు సంక్షేమ పథకాలు అమలయ్యేవి కావని అన్నారు.












Click it and Unblock the Notifications