కలకలం రేపుతున్న బంగారం పుకార్లు.
జనగామ :జనగామ జిల్లాలోని కొందరికి గుప్త నిదులు లభ్యమయ్యాయనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.ఆ నోటా ఈ నోట ఈ ప్రచారం కాస్త పోలీస్ స్టేషన్ వరకు చేరింది. కాని, బంగారం దొరకలేదని పోలీసులు చెబుతున్నారు.
జనగామ జిల్లాలోని నర్మెట మండలం అమ్మాపురం గ్రామంలో కొందరికి గుప్త నిధులు దొరికాయనే ప్రచారం సాగుతోంది.ఈ గ్రామంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈ విషయమై చర్చ సాగుతోంది. అయితే గుప్త నిధులు దొరికినట్టు సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పోలీసులు చెబుతున్నారు.

అమ్మాపురం గ్రామానికి చెందిన ఓ ఇంట్లో నిధులు దొరికాయని కొందరు, మసీదు వద్ద దొరికాయని మరికొందరు చెబుతున్నారు.ఈ గ్రామంలో కాకుండా జిల్లాలోనే వేరే ప్రాంతాల్లో నిధులు లభ్యమయ్యాయనే ప్రచారం కూడ సాగింది.ఈ విషయం పై పోలీసులకు సమాచారం అందింది.
గ్రామానికి చెందిన అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.గ్రామానికి చెందిన ఓ వ్యవసాయ బావి వద్ద వెతికితే రెండు బాక్సలు దొరికాయి. అందులో ఏమీలేవు. ఒక గ్లాసు దొరికింది. గ్రామస్థుల ముందే వాటిని పోలీసులు తెరిచారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. అసలు నిజంగా బంగారం దొరికిందా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'












Click it and Unblock the Notifications