అల్లు అర్జున్కు పెరుగుతున్న రాజకీయ మద్దతు?
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ముసురుకున్న వివాదాలు రోజురోజుకూ తీవ్ర రూపాన్ని దాల్చుతూ వస్తోన్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన.. అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చిన తరువాత ఈ వ్యవహారం మొత్తం రోజుకో మలుపు తిరుగుతోంది. అల్లు అర్జున్ను మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది.
అసెంబ్లీలో చర్చతో..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చంద్రాయణగుట్ట శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ సహా పలువురు సభ్యులు ఈ తొక్కిసలాట ఉదంతంపై ఘాటుగా స్పందించారు. అదేరోజు సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఈ వివాదానికి అడ్డుకట్ట వేయకపోగా మరింత ఆజ్యం పోసినట్టయింది.

ప్రెస్ మీట్ తరువాత ఆయనపై దాడి..
ఈ ప్రెస్ మీట్ తరువాత ఆయనపై దాడి మరింత తీవ్రతరమైంది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు బల్మూరి వెంకట్, విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్లో పశ్చాత్తాపం ఎంతమాత్రం కనిపించట్లేదని విమర్శించారు. పోలీసులను సైతం తప్పు పట్టేలా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్..
అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి కిందటే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు విచారణకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట తండ్రి అల్లు అరవింద్, మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, లీగల్ టీమ్ సభ్యులు ఉన్నారు.
సానుకూలం..
అల్లు అర్జున్ ఉదంతంపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యుడు ఎం రఘునందన్ రావు స్పందించారు. ఆయన పట్ల సానుకూలంగా మాట్లాడారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్ ప్రమేయం ఏముందని ప్రశ్నించారు. ఎన్నో సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్నాయని, వాటితో పోల్చి చూస్తే ఇది చిన్నదేనని వ్యాఖ్యానించారు.
తొక్కిసలాట ఎవరి వైఫల్యం..
తొక్కిసలాట ఎవరి వైఫల్యం వల్ల సంభవించిందనే ఇక్కడ ప్రధానమని అన్నారు. సంధ్యా థియేటర్ వద్ద ప్రేక్షకులకు భద్రత కల్పించే విషయంలో ఎవరు విఫలం చెందారని ప్రశ్నించారు. పోలీసులా? లేక థియేటర్ యాజమాన్యమా? అనేది తేలాలని, ఈ దిశగా దృష్టి సారించాలని అన్నారు.
తప్పును కప్పిపుచ్చుకోవడానికి..
దీనిపై కాకుండా అల్లు అర్జున్ను కారకుడిగా చూపిస్తూ అరెస్ట్ చేయడం సరికాదని రఘునందన్ రావు అన్నారు. ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం మరో తప్పు చేస్తోందని విమర్శించారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం తప్పయినప్పుడు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎలా ప్రెస్ మీట్ పెట్టగలరని, తొక్కిసలాట వీడియోలను ఎలా సోషల్ మీడియాలో విడుదల చేయగలరని ప్రశ్నించారు.
#WATCH | Hyderabad | Allu Arjun arrives to appear before Police in Sandhya theatre stampede incident, BJP leader Raghunandan Rao says, "It is a small case. It is like any other small case in the state. What was the role of the Police and the actor in that stampede? Instead of… pic.twitter.com/RkJl33alhO
— ANI (@ANI) December 24, 2024
కోర్టులో ఉన్నందున..
ప్రస్తుతం ఈ అంశం మొత్తం కూడా కోర్టులో ఉన్నందున అటు పోలీసులు గానీ, ఇటు టాలీవుడ్ పెద్దలు గానీ మాట్లాడకపోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్పై పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని విజ్ఞప్తి చేస్తోన్నానని రఘునందన్ రావు చెప్పారు. వ్యక్తిగతంగా పోలీసులు ఎలాంటి ప్రతీకారాలను తీర్చుకోకూడదని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ కూడా విచారణకు సహకరిస్తోన్నప్పుడు దీన్ని వివాదం చేయడం సరైంది కాదని రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications