పీవీ సంస్కరణలే దేశాన్ని కాపాడాయి.. మాజీ ప్రధానికి కేసీఆర్, జగన్ నివాళి.. హెచ్సీయూకు పీవీ పేరు..
''ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయానికి దేశం అధకారంలో ఉండింది.. ఉన్న బంగారం నిల్వలను విదేశాల్లో తాకట్టు పెట్టుకునే పరిస్థితి. తనకు మాత్రమే సాధ్యమైన దేశాన్ని కాపాడి, ఆర్థిక రంగంలో మరింత ముందుకు నడిపించిన ధీరుడాయన..'' అంటూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కీర్తించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాభివృద్ధి కోసం పీవీ అందించిన సేవలను తరతరాలు గుర్తుంచుకుంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మాజీ ప్రధాని పీవీ శతజయంతి సందర్భంగా ఇద్దరు సీఎంలు నివాళులు అర్పించారు.
Recommended Video

పీవీ జ్ఞానభూమిలో..
శతజయంతి సందర్భంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావును దేశమంతా స్మరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్' కార్యక్రమంలో పీవీ సేవలను యాదిచేసుకున్నారు. పీవీ తెలంగాణకు చెందినవారు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నది. హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని పీవీ జ్ఞానభూమిలో ఆదివారం జరిగిన ముఖ్య వేడుకలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

360 డిగ్రీల వ్యక్తిత్వం..
‘‘పీవీ తెలంగాణకు ఠీవి. ఆయనది 360 డిగ్రీల అసాధారణ వ్యక్తిత్వం. ఆయన జీవితమంతా సంస్కరణతోనే సాగింది. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా.. ఏ హోదాలో పనిచేసినా ఆ పదవికే గౌరవం తీసుకొచ్చారు. రాజకీయాలకు సంబంధంలేని మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించుకుని, గొప్ప సంస్కరణలతో దేశాన్ని గట్టెక్కించారు. విద్యాశాఖ పేరును హెచ్ఆర్డీగా మార్చడమేకాదు, దేశంలో గురుకుల పాఠశాలన్ని ప్రారంభించింది కూడా పీవీనే. స్వతహాగా 1200 ఎకరాల భూస్వామిఅయినా, తనవకు కేవలం 150 ఎకరాలు ఉంచుకొని మిగతాది ప్రజలకు ఉపయోగించిన ఉదారవాది పీవీ'' అని కేసీఆర్ గుర్తుచేశారు.

హెచ్సీయూకు పీవీ పేరు..
ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)కి పీవీ నరసింహారావు పేరు పెట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దేశానికి గొప్పగా దిశానిర్దేశం చేసిన పీవీకి తగిన గుర్తింపు లభించలేదని, ఆయన పేరు ప్రఖ్యాతలు మరింత ఇనుమడింపజేసేలా తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని, పీవీకి భారతరత్న పురస్కారం విషయంలోనూ కేంద్రానికి లేఖ రాశామని కేసీఆర్ తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూకు సమాంతర వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పీవీ అని, 50కిపైగా దేశాల్లో ఆయన శతజయంతి ఉత్సవాలు జరుగుతుండటం గమనార్హమని కేసీఆర్ అన్నారు.

భావితరాలూ పీవీని స్మరిస్తాయి..
ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి విశేష కృషి చేసిన పీవీ నరసింహారావును రాబోయే తరాలు కూడా స్మరించుకుంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మాజీ ప్రధాని పీవీ శతజయంతి సందర్భంగా ఆయనకు సీఎం నివాళులు అర్పించారు. వివేకవంతుడైన రాజకీయవేత్త, బహుభాషా కోవిదుడిగా పీవీని కీర్తించారు. ప్రధానిగా పీవీ సేవలను మరువలేమని, దేశంలో సంస్కరణలకు ఆయనే ఆద్యుడని, పీవీ నిర్ణయాలతో దేశముఖచిత్రమే మారిపోయిందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications