Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ రైళ్లు ఖరారు - రూట్, షెడ్యూల్ ఫిక్స్...!!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మరో రెండు వందేభారత్ రైళ్లకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్లకు ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. దీంతో.. కొత్తగా మరో రెండు వందేభారత్ రైళ్ల కు ఆమోదం లభించింది. దీపావళి నుంచి ఈ రైళ్లు పట్టాలెక్కున్నాయి. ఈ రెండు రైళ్లకు సంబంధించిన రూట్.. షెడ్యూల్ ను అధికారులు ఖరారు చేసారు.

తెలుగు రాష్ట్రాల నుంచి మరో రెండు వందేభారత్‌ రైళ్లు పరుగులు తీయనున్నాయి. నాంపల్లి- పుణె, చర్లపల్లి-నాందేడ్‌ మధ్య ఈ కొత్త రైళ్లు నడుస్తాయి. నాంపల్లి-పుణె మధ్య వందేభారత్‌ రైలు సర్వీసును తీసుకురావాలని ఇటీవలే ప్రతిపాదన వచ్చింది. దానికి రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో చర్లపల్లి-నాందేడ్‌ మధ్య కూడా వందేభారత్‌ రైలును పట్టాలు ఎక్కేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నుంచి ఇప్పటికే 5 వందేభారత్‌ రైళ్లు నడుస్తుండగా ఇప్పుడు మరో రెండు చేరనుండడంతో ఆ సంఖ్య ఏడుకి చేరుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి 600 కిలోమీటర్లు దూరం ఉన్న ప్రాంతాలకే ఈ రైళ్ల సర్వీసులు కొనసాగుతున్నాయి. కొత్తగా మంజూరైన హైదరాబాద్‌-నాందేడ్‌ సర్వీసు మధ్య 281 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది.

Railway board to launch new vandebharat trains from Cherlaplly to nanded and Pune

ఇక, నాందేడ్‌లోని వ్యాపారులకు తెలంగాణతో వాణిజ్య సంబంధాలు బాగా ఉంటాయి. అలాగే, హైదరాబాద్‌-నాందేడ్‌ మార్గంలో నిజామాబాద్‌ పట్టణం ఉంటుంది. దీంతో అక్కడి వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌ నుంచి పుణ్యక్షేత్రం బాసరకు ప్రయాణీకుల రాకపోకల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక.. హైదరాబాద్ - పూణే మధ్య వందేభారత్ కోసం సుదీర్ఘ కాలం గా ప్రతిపాదన పెండింగ్ లో ఉంది.

ఈ నగరాల మధ్య 592 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొత్తగా వందేభారత్ కేటాయింపు ద్వారా 8 గంటల్లోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం కలుగుతుంది. చర్లపల్లి నుంచి పెద్ద సంఖ్యలో రైళ్ల రాకపోకలు సాగుతుండటంతో.. ఇప్పుడు చర్లపల్లి - నాందేడ్ మధ్య వందేభారత్ ఖరారు చేసారు. ఇక.. హైదరాబాద్ - పూణే మధ్య ప్రస్తుతం 17 రైళ్లు రాకపోక లు సాగిస్తున్నాయి. ఇతర రైళ్లకు పూణే వెళ్లేందుకు 12 గంటల వరకు సమయం పడుతోంది. ఇప్పుడు వందేభారత్ ద్వారా ప్రయాణీకులకు సమయం ఆదా కానుంది. దీపావళి నుంచి ఈ రెండు రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+