శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, చర్లపల్లి - తిరుచానూరు ప్రత్యేక రైళ్లు: రూట్.. షెడ్యూల్..!!
శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వరుస సెలవులు.. పండుగల వేళ రద్దీ ఎక్కువ గా ఉండటంతో చర్లపల్లి- తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్ల తేదీలతో సహా హాల్టింగ్ స్టేషన్లు.. షెడ్యూల్ ను వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణీకులకు వీలుగా ఈ రైళ్లను ఏర్పాటు చేసారు. ఈ ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-తిరుచానూరు (తిరుపతి) మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. 07025 ప్రత్యేక రైలు ఈనెల 4న చర్లపల్లి నుంచి తిరుచానూరుకు, 07026 ప్రత్యేక రైలు 5న తిరుచానూరు నుంచి చర్లపల్లికి నడుస్తాయని పేర్కొన్నారు. అలాగే 9న హైదరాబాద్-మంగళూరుల మధ్య 07097, 10న మంగళూరు-హైదరాబాద్ మధ్య 07098 నంబర్ గల ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్స్ రెండు దిశలలోనూ మార్గమధ్యంలో ప్రయాణికులకు అనువుగా పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. తెలంగాణలోని నల్లగొండ, మిర్యాలగూడ, ఏపీలోని గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లురూ, రేణిగుంట స్టేషన్లలో ఆగనున్నట్లు అధికారులు తెలిపారు.

రైల్వే శాఖ తాజా నిర్ణయంతో
కాగా, ఈ ప్రత్యేక రైళ్లల్లో 1AC కమ్ 2AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది దక్షిణ మధ్య రైల్వే. ఈ నెల 4వ తేదీ నుంచి వరుసగా మూడు రోజులు పాఠశాలలు, కార్యాలయాలకు సెలవులు. దీంతో.. తిరుమలకు వెళ్లే వారి రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందునా శ్రావణ మాసం కావటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. ఈ నెలలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి అనుగుణం గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాణిస్తున్న రెగ్యులర్ రైళ్లలో కొనసాగుతున్న వెయిటింగ్ లిస్టుతో ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ప్రయాణీకుల స్పందనకు అనుగుణంగా కొనసాగింపు పైనా నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసారు.













Click it and Unblock the Notifications