షాక్: బ్రేక్ఫాస్ట్లో ఎలుక, 18మంది విద్యార్థులకు అస్వస్థత
మెదక్: వంట సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పలువురు పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం మునిపల్లి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారంగా కిచిడీ వడ్డించారు.
అయితే, ఏడో తరగతి చదువుతున్న అరుణ్ గిన్నెలోని ఆహారంలో పూర్తిగా ఉడికిన ఎలుక రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వండేవారు ఎలుకను తీసేసి అదే కిచిడీని పిల్లలందరికీ వడ్డించేశారు. దీంతో కొందరు విద్యార్థులకు వాంతులైన ఘటన సంగారెడ్డిజిల్లా మునిపల్లిమండలం లింగంపల్లి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.

కిచిడీ తిన్న వెంటనే 18 మందికి వాంతులు అవుతున్న విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల వారు అధికారులు, వైద్యులకు సమాచారం అందించారు. మునిపల్లి మండల వైద్యాధికారులు వినయ్కుమార్, ప్రతాప్ పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
తహసీల్దార్ పద్మావతి పాఠశాలను సందర్శించి, వండుతున్నఅన్నాన్ని పరిశీలించారు. కాగా, అందులో మట్టిరాళ్లు, దుమ్ము ఉండటంతో గుత్తేదారుడు, వంటమనిషిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలకు ఇలాంటి భోజనమే పెడతారా అంటూ వార్డెన్ అశోక్, సిబ్బందిపై మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications