కేంద్రం ఆర్డర్ ఏకపక్షం: చెన్నమనేని రమేష్కు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: చెన్నమనేని రమేష్కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన భారత పౌరుడు కాదంటూ కేంద్ర హోంశాఖ ఇటీవల తేల్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన హైకోర్టుకు వెళ్లారు.
హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. పౌరసత్వం రద్దుపై కేంద్రం ఇచ్చిన ఆర్డర్లు ఏకపక్షమని హైకోర్టు చెప్పింది. కేంద్రం ఉత్తర్వులను ఆరువారాల పాటు నిలిపివేసింది. మళ్లీ వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.

కాగా, చెన్నమనేని రమేష్కు కేంద్రం గత ఏడాది డిసెంబర్లో షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆయన భారత పౌరుడు కాదంటూ కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఇప్పుడు హైకోర్టు నేపథ్యంలో మరో మలుపు తిరిగింది.












Click it and Unblock the Notifications