టీడీపీ ఎంపీలకు అకాలీదళ్ మద్దతు, హోదా ఇవ్వాలని రేణుక చౌదరి, కేకే కూడా
న్యూఢిల్లీ: ఎన్డీయే సంకీర్ణంలో టీడీపీ భాగస్వామిగా ఉంటూ ఏపీకి న్యాయం చేయాలని అడగడం సిగ్గుచేటు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో మండిపడ్డారు. న్యాయం చేయలేదని భావిస్తే పదవుల నుంచి తప్పుకోవాలన్నారు.
శుక్రవారం రాజ్యసభలో ఏపీ ఎంపీల ఆందోళనకు అకాలీదళ్, టీఆర్ఎస్ ఎంపీ కే కేశవ రావులు మద్దతు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రేణుకా చౌదరి కూడా సూచించారు.

రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోవాలన్నారు. ఇదే సభలో హామీలు ఇచ్చామని, ఆ హామీలు అమలు చేయాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏం అడ్డంకి వచ్చిందని ప్రశ్నించారు.
టీడీపీ ఎంపీల ఆందోళనకు అకాలీదళ్ మద్దతు పలికింది. ఏపీ డిమాండ్లను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరిశీలించాలని అకాలీదళ్ విజ్ఞప్తి చేసింది. విభజన హామీల మేరకు ప్యాకేజీలో అంశాలను చేర్చాలని చెప్పారు.
మరోవైపు, ఏపీ ఎంపీలకు టీఆర్ఎస్ ఎంపీ కే కేశవ రావు కూడా మద్దతు తెలిపారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. చట్టంలోని వాటిని అమలు చేస్తామంటే అభ్యంతరం చెప్పేందుకు మేం ఎవరమని అడిగారు. అలాగే తెలంగాణకు రావాల్సిన హామీలు కూడా నెరవేర్చాలన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications