కట్నం కోసం చిత్రహింసలు పెట్టారు! రిటైర్డ్ జడ్జిపై కోడలు ఫిర్యాదు, కేసు నమోదు!
హైదరాబాద్ : రిటైర్డ్ జడ్జి జస్టిస్ నూతి రామ్మోహనరావుపై ఆయన కోడలు వరకట్న వేధింపుల కేసు పెట్టారు. తన భర్త వశిష్ఠతో పాటు అత్త జయలక్ష్మి, మామ జస్టిస్ నూతి రామ్మోహన రావు తనను చిత్రహింసలు పెట్టారని సింధూశర్మ హైదరాబాద్లోని సీసీఎస్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు రిటైర్డ్ జడ్జితో పాటు ఆయన కుటుంబసభ్యులపై కేసు నమోదుచేశారు.

కట్నం కోసం వేధింపులు
జస్టిస్ నూతి రామ్మోహన రావు తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్లోని జర్నలిస్టు కాలనీలో నివాసముంటున్నారు. ఆయన కుమారుడు వశిష్ఠకు సింధూశర్మతో ఏడేళ్ల క్రితం పెళ్లైంది. వారికి మూడున్నరేళ్లు, 11నెలల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. అయితే పెళ్లై అత్తారింట్లో అడుగుపెట్టిన నాటి నుంచి భర్త, అత్తమామలు అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని సింధూశర్మ ఆరోపిస్తున్నారు. వారు అడిగినట్లు చేయకపోవడంతో తరుచూ కొట్టే వారని చెప్పారు. ఈ నెల 20 దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టడంతో ఇక భరించలేక తాను పోలీసులను ఆశ్రయించానని అన్నారు.

498ఏ, వరక్నట వేధింపుల కేసు
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నూతి రామ్మోహన్రావు కొడుకు వశిష్ఠ, కోడలు సింధులకు మహిళా పోలీస్ స్టేషన్లో రెండుసార్లు కౌన్సిలింగ్ నిర్వహించారు. శనివారం మరోసారి వారిద్దరితో మాట్లాడినప్పటికీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఐపీసీ సెక్షన్ 498ఏ, 406, 323తో పాటు వరకట్న వేధింపుల నిరోధక చట్టం కింద కేసు బుక్ చేశారు.

నా పిల్లల్ని నాకు ఇప్పించండి
ఈ నెల 20న వశిష్ఠ. అతని తల్లిదండ్రులు తీవ్రంగా కొట్టడంతో సింధూశర్మ జూబ్లీహిల్స్ అపోలీ హాస్పిటల్లో చేరినట్లు తెలుస్తోంది. ఆమె భుజం, ఛాతీ, చాతిపై గాయాలైనట్లు అపోలో డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్ను ఆమె పోలీసులకు ఇచ్చారు. ఇదిలా ఉంటే తనను చిత్రహింసలు పెట్టి పిల్లలిద్దరినీ తన నుంచి లాక్కున్నారని, వారిని తిరిగి తనకు అప్పగించాలని సింధు కోరుతున్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications