హైదరాబాద్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తాం: సీఎం రేవంత్
చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో హైదరాబాద్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికులు తమ సమస్యలపై చర్చించుకుని ఏం కావాలో ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పారు. ఈ మేరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధులు, సభ్యులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. కార్మికుల సంక్షేమం కోసం సినీరంగ కార్మికులకు ఏమి కావాలో చర్చించుకుని ప్రభుత్వానికి తెలియజేయాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ వారితో వివరంగా చెప్పారు.
ఇటీవల నిర్మాతలతో జరిగిన సమావేశంలో సినిమా కార్మికులను విస్మరించవద్దని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సినిమా కార్మికులలో నైపుణ్యాల పెంపుకు సహకరించాల్సిందిగా నిర్మాతలను కోరానని చెప్పారు. చలనచిత్ర రంగంలో కార్మికులు నైపుణ్యాలను పెంచుకోవలసిన అవసరం ఉందని, అందుకోసం స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా కార్మికుల శిక్షణ అందించే కార్యక్రమం చేపడతామని అన్నారు. అన్ని భాషల చిత్రాలు తెలంగాణలో షూటింగ్ జరిగేలా అందరూ సహకరించాలని, ఈ విషయంలో ముఖ్యంగా చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలని చెప్పారు. చిత్ర పరిశ్రమలో సానుకూల పని వాతావరణాన్ని చెడగొట్టుకుని సమ్మెలకు వెళ్లడం వల్ల రెండు వైపులా నష్టం జరుగుతుందని వివరించారు.
సినిమా కార్మికుల తరఫున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని చెప్పారు. ప్రభుత్వం సమస్యలను సమస్యలుగానే చూస్తుందని, వ్యక్తిగత పరిచయాలు ప్రధానం కాదని స్పష్టం చేశారు. సినీ కార్మికుల సమస్యలను పరిష్కరించే బాధ్యతను తీసుకుంటానని, ఈ విషయంలో తాను కార్మికుల పక్షాన ఉంటానని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుందని వివరించారు. సమ్మె జరుగుతుంటే ప్రభుత్వం నిర్లిప్తంగా ఉండలేదని స్పష్టం చేశారు.

అంతకుముందు పదేళ్ల పాటు సినిమా రంగంలో అవార్డులు ఇవ్వని అంశాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తూ తమ ప్రభుత్వం సినీ కళాకారులకు గద్దర్ అవార్డులను బహూకరించిన విషయాన్ని వివరించారు. అదే క్రమంలో సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా అందించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. గడిచిన ఎన్నో ఏళ్లుగా సినిమా కార్మికులను పిలిచి మాట్లాడిన ముఖ్యమంత్రి లేరని ఈ సందర్భంగా సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications