హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..!
ఆయిల్ పామ్ కంపెనీ ఇక్కడున్న ఎమ్మెల్యే కోసం కాదు, రైతుల కోసమని సిద్దిపేట రైతు ఉత్సవాల్లో బీఆర్ఎస్ నేత హరీష్ రావు (harish rao)ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy)కౌంటర్ ఇచ్చారు. తాను వివక్ష చూపనని, తనది వివక్ష చూపే తత్వం కాదని తేల్చేశారు. తాము పేదల కోసం పని చేస్తాం తప్ప, రాజకీయ నాయకుల కోసం కాదన్నారు. వివక్ష గురించి మాట్లాడాలంటే ఆనాడు కొడంగల్ కు ఎన్ని నిధులు ఇచ్చారో చర్చిద్దాం రండి అంటూ సవాల్ విసిరారు. పదేళ్లు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు, ఇప్పుడు పదేళ్లు ప్రజలు మమల్ని ఆశీర్వదిస్తారన్నారు. 2029 లో మళ్లీ అధికారం మాదే అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో ఎమ్మెల్యేగా గెలిపించిన వాళ్లను మంత్రిని చేసే బాధ్యత మా మంత్రులు వివేక్, దామన్నకు అప్పగిస్తున్నానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ఒకే కుటుంబం నుంచి శాసన ఎమ్మెల్యేలుగా ఉంటున్నారని,ఇతరులకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. మార్పు చేసి చూడండి, మంచి జరుగుతుందో లేదో చూడాలన్నారు. మీరు అడ్డుకుంటే ఏదీ ఆగదంటూ బీఆర్ఎస్ నేతలపై వ్యాఖ్యలు చేశారు. మళ్లీ 2029 లో వస్తాం, సిద్దిపేటలో గెలిపించిన వ్యక్తిని మంత్రిని చేస్తామన్నారు. సిద్దిపేటను 119 నియోకవర్గాలతో సమానంగా చూస్తామని, ఎలాంటి వివక్ష చూపాల్సిన అవసరం లేదన్నారు.

ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదని తాను బలంగా నమ్ముతానన్నారు. అందుకే రైతుల సంక్షేమం విషయంలో ఎక్కడా లోటు రాకుండా రైతుల కళ్లలో ఆనందం చూడాలని రైతు భరోసా నిధులు విడుదల చేశామన్నారు.45 రోజుల్లో మూడు విడతలుగా 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల కోసం ప్రతీ నెల రూ.2533కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, తమ ప్రభుత్వం 28 నెలల్లో ప్రతీ నెల రూ.5500 కోట్లు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తున్నామన్నారు.
రైతు సంక్షేమం కోసం రెండేళ్లలో లక్ష కోట్లకుపైగా ఖర్చు చేశామని రేవంత్ తెలిపారు. దేశంలోనే వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని, వ్యవసాయంలో మార్పు రావాలని, రైతులు పంట మార్పిడి విధానం అనుసరించాలని కోరారు. గతంలో ప్రాంతాల వారీగా వివిధ రకాల పంటలు పండించేవారని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పండ్ల తోటలు ఎక్కువగా కనిపించేవని, వరి ఒక్కటే కాదు, అన్ని రకాల పంటల సాగు వైపు రైతుల్ని ప్రోత్సహించాలన్నారు. ఈసారి 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశామని,కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నులకు మించి కొనడం లేదని తెలిపారు. అందుకే పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

పామాయిల్ పంట 3 లక్షల ఎకరాలకు చేరిందని, పది లక్షల ఎకరాలు సాగుచేసినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఆయిల్ పామ్ కర్మాగారం నిర్మించాలని మంత్రి తుమ్మలను కోరారు. వ్యవసాయంలో 12,728 గ్రామ పంచాయితీలకు అంకాపూర్ స్ఫూర్తి కావాలని, ప్రతీ గ్రామాన్ని అంకాపూర్ లా తీర్చి దిద్ది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో పంటలను ఎగుమతులు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణలో పండే ప్రతీ పంటను లాభసాటిగా మార్చడమే బంగారు తెలంగాణ అన్నారు.
-
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రాజకీయ కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications