వారికి గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
రాష్ట్రంలోని చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంగన్ వాడీ చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను ప్రారంభించారు. అంగన్ వాడీ చిన్నారులకు ఇక నుంచి రెడీ టూ కుక్ ఫుడ్ ను అందించనున్నారు. బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా ఉప్మా, కిచిడీ మిక్స్ ను బ్రేక్ ఫాస్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు అంగన్ వాడీ కార్యకర్తలు చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకుని వారికి పౌష్టికాహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్న సంకల్పంతో 'తొలి ముద్ద' పేరుతో కొత్త బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఇకపై చిన్నారులకు ఉప్మా, కిచిడీ మిక్స్ వంటి 'రెడీ టూ కుక్' ఆహారాన్ని అల్పాహారంగా అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలకు పౌష్టికాహారం అందించాలి. వారి ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్న ఆలోచనతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టాం. తల్లి గర్భంతో ఉన్నప్పుడు తల్లితో పాటు కడుపులోని శిశువు, అలాగే పుట్టిన తర్వాత పిల్లలకు ఎలాంటి పోషకాహారం అందించాలన్న అంశాలపై సమగ్రంగా చర్చించిన తర్వాత ఈ కార్యాచరణ చేపట్టామని తెలిపారు.

అలాగే అంగన్ వాడీ కార్యకర్తలు.. చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకుని వారికి పౌష్టికాహారం అందించాలన్నారు. అలాగే అంగన్ వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీళ్లేదని.. సొంత భవనాలు నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. అంగన్ వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల మాదిరిగా భావిస్తోందని.. మీ సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని తెలిపారు. ఏ మాత్రం ఆర్ధిక వెసులుబాటు కలిగినా ముందుగా మీ సమస్యలనే పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
-
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications