Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన నలుగురు సోదరుల మృతి

హైదరాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చౌటపల్లికి చెందిన నలుగురు మృతి చెందారు. చనిపోయిన నలుగురు కూడా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఎరుకుల కృష్ణ, సంజీవ్, సురేష్, వాసుగా గుర్తించారు. బంధువుల అంత్యక్రియలకు వచ్చి సూరత్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కొన్నేళ్ల క్రితం ఈ నలుగురు అన్నదమ్ములు ఉపాధి కోసం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లారు. ఐదు రోజుల క్రితం వీరి స్వగ్రామమైన చౌటపల్లిలో బంధువు ఎరుకల రాములు మృతి చెందారు. ఈ క్రమంలో అతడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తమ కుటుంబసభ్యులతో కలిసి చౌటపల్లికి వచ్చారు. కుటుంబసభ్యులను చౌటపల్లిలోనే ఉంచి ఈ నలుగురు సోదరులు తిరిగి సూరత్‌కు మంగళవారం కారులో బయల్దేరారు.

Road accident in Maharashtra: four brothers from Telangana killed

అదే రాత్రి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులు ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సోదరులు మృతి చెందడంతో వారి కుటుంబాలతోపాటు స్వ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

మరో ప్రమాదంలో ఆరుగురు మృతి:మహారాష్ట్రలోని బుల్‌ఢాణా జిల్లాలో మంగళవారం ఎంఎస్ఆర్టీసీ బస్సు ఓ కంటైనర్ ట్రక్కును ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఓల్డ్ ముంబై-నాగపూర్ హైవే సింధ్‌ఖేడ్ రాజా పట్టణ సమీపంలో ఉదయం 7.20 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

మృతుల్లో రెండు వాహనాల డ్రైవర్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నారు. 33 మంది ప్రయాణికులతో బస్సు పుణె నుంచి మెహకర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+