ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మేడారం జాతరకు వెళ్లొస్తుండగా ఘటన!

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శుక్రవారం సాయంత్రం మేడారం సమక్మ-సారలమ్మలను దర్శించుకుని తిరిగి వస్తూ ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

హైదరాబాద్: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శుక్రవారం సాయంత్రం మేడారం సమక్మ-సారలమ్మలను దర్శించుకుని తిరిగి వస్తూ ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

పస్రా వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మరో కారులో ఎమ్మెల్యే శంకర్ నాయక్ వెళ్లిపోయారు.

trs-mla-shankar-nayak

ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై వారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

మరోవైపు మేడారం మహా జాతర నాలుగో రోజు ఘనంగా కొనసాగుతోంది. జాతరకు శనివారం ఆఖరిరోజు కావడంతో భక్తులు పోటెత్తారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆదివాసీ పూజారులు గద్దెల వద్దకు చేరుకుంటారు. పూజల అనంతరం దేవతల వన ప్రవేశంతో జాతర ముగియనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+