ఆర్టీసీ బస్సు బీభత్సం: నాలుగు వాహనాలు ధ్వంసం(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు పని చేయకపోవడంతో ఒక్కసారిగా వాహనాల మీదకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఒక స్కూటర్, ఆటో, రెండు కార్లు ధ్వంసమయ్యాయి.
మెహదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బోరబండ నుంచి మెహదీపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్డు నెం.1లోని కేర్ ఆస్పపత్రి సమీపంలో బ్రేకులు పని చేయక అదుపు తప్పింది.
ముందున్న వాహనాలను ఢీకొడుతూ ముందుకు కదలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. బస్సు డ్రైవరు బి రామకృష్ణను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు బీభత్సం
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్లో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు పని చేయకపోవడంతో ఒక్కసారిగా వాహనాల మీదకు దూసుకెళ్లింది.
బస్సు బీభత్సం
ఈ సంఘటనలో ఒక స్కూటర్, ఆటో, రెండు కార్లు ధ్వంసమయ్యాయి.
బస్సు బీభత్సం
మెహదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బోరబండ నుంచి మెహదీపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బస్సు బీభత్సం
బంజారాహిల్స్ రోడ్డు నెం.1లోని కేర్ ఆస్పపత్రి సమీపంలో బ్రేకులు పని చేయక అదుపు తప్పింది.
బస్సు బీభత్సం
ముందున్న వాహనాలను ఢీకొడుతూ ముందుకు కదలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. బస్సు డ్రైవరు బి రామకృష్ణను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.