కేసీఆర్ను తిట్టేందుకేనా సభలు?: రేవంత్ రెడ్డికి కంటగింపు అంటూ సబిత ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. శాసనసభలో తాను కనిపిస్తేనే సీఎం రేవంత్ రెడ్డికి కంటగింపుగా ఉందని మండిపడ్డారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని 4 గంటలు నిలబడినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మేం ఇప్పటివరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశామని అన్నారు. వారు మహిళలకు అవకాశం ఇవ్వాలని అన్నారని గుర్తు చేశారు. వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ మహిళలకు సభలో ఎంతో గౌరవం ఇచ్చేవారని కొనియాడారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం తాను సభలో కనిపిస్తేనే కంటగింపుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను తిట్టేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఉందని సబిత మండిపడ్డారు.

సభలో 9 మంది మహిళా సభ్యులుంటే మాట్లాడే అవకాశమే రావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. చట్టసభల్లోనూ మహిళల పట్ల వివక్ష చూపటం సరికాదు. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడుదామనుకుంటే మైకు ఇవ్వలేదు. మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. పార్టీ మారటం పెద్ద నేరం అయితే ఇప్పుడు కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరలేదా?. నా వల్ల సీఎల్పీ పదవి పోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పుడు ఎస్సీ నేతకు సీఎం పదవి ఇవ్వాలని ఆయన ఎందుకు అడగలేదు? అని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
సభలో లేని ఎమ్మెల్సీ కవిత గురించి సభలో ఎందుకు ప్రస్తావించాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు. ఆడబిడ్డ అయితే శత్రువు కుమార్తె అయినా జాలి చూపే సమాజం మనదని హితవు పలికారు. తమను అవమానించిన తీరును రాష్ట్రమంతా గమనించిందన్నారు. రాష్ట్రంలో, హైదరాబాద్లో మహిళలకు భద్రత కరువైందని ధ్వజమెత్తారు. మహిళలపై పెరుగుతున్న అత్యాచారాల గురించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమోనని మహిళలు ఆశగా చూస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సభలో జూనియర్ శాసనసభ సభ్యులు మమ్మల్ని హేళనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అత్యాచారాలకు కేంద్రంగా మారుతోందన్నారు. మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు. బాధితులకు భరోసా ఎక్కడ అని ప్రశ్నించారు. ఇటువంటివి ఎందుకు పునరావృతం అవుతున్నాయని, చర్యలు ఎక్కడ అని నిలదీశారు. ఆరోజు రేవంత్ రెడ్డి ప్రచారంలో మాట్లాడిన మాటలకు తనపై కూడా మూడు కేసులు అయ్యాయని గుర్తు చేశారు సునీత లక్ష్మారెడ్డి.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications