లేకుండా సస్పెండని సండ్ర, నర్సారెడ్డి వ్యాఖ్య దుమారం
హైదరాబాద్: జాతీయ గీతాన్ని అవమానించారని ఆరోపిస్తూ టీడీపీ సభ్యులను తెలంగాణ అసెంబ్లీ నుండి ప్రభుత్వం సస్పెండ్ చేసిన సమయంలో తాను సభలోనే లేనని, అలాంటప్పుడు తనను ఎలా సస్పెండ్ చేస్తారని సండ్ర వెంకట వీరయ్య ప్రశ్నిస్తున్నారు. జాతీయ గీతాన్ని అవమానించారని టీడీపీ సభ్యులను తెరాస ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల వరకు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

మండలిలో నర్సా రెడ్డి వ్యాఖ్యలపై దుమారం
మండలిలో టీడీపీ నేత అరికెల నర్సిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మంగళవారం దుమారం రేపాయి. ఓ విషయమై మాట్లాడుతూ.. ప్రభుత్వం గాజులు తొడుక్కుందా అంటూ వ్యాఖ్యానించారు. దీంతో సభలో దుమారం రేగింది. గాజులు తొడుక్కుందా అంటూ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించిన నర్సారెడ్డి క్షమాపణ చెప్పాలంటూ తెరాస సభ్యులు పట్టుపట్టారు.
తాను లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వకుండా విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని నర్సారెడ్డి అన్నారు. ఒకవేళ తన వ్యాఖ్యలు మహిళలు నొచ్చుకునేలా ఉన్నట్లయితే క్షమాపణ కోరుతున్నానని అనడంతో వివాదం అంతటితో సద్దుమణిగింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications