ఇంత దారుణమా..? పెళ్లి పేరుతో యువకుడ్ని ఇంటికి పిలిచి మరీ..
ప్రేమ వ్యవహారం నేపథ్యంలో మరో యువకుడు బలయ్యాడు. తమ కూతుర్ని ప్రేమిస్తున్నాడన్న కారణంతో బీటెక్ స్టూడెంట్ ను అమ్మాయి తల్లిదండ్రులు అత్యంత దారుణంగా హత్య చేసిన దారుణమైన ఘటన కలకలం రేపుతోంది. పెళ్లి గురించి మాట్లాడుకుందాం రా అని ఇంటికి పిలిపించుకుని హత్య చేయడంపై యువకుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రేమ వ్యవహారం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. తమ కూతుర్ని ప్రేమిస్తున్నాడన్న కారణంతో పెళ్లి విషయంపై మాట్లాడుకుందామని యువకుడికి మాయమాటలు చెప్పి ఇంటికి పిలిపించుకున్న యువతి తల్లిదండ్రులు అతడ్ని కిరాతకంగా హతమార్చారు. ఈ దారుణమైన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ సృజన లక్ష్మీ నగర్లో వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..
జ్యోతి శ్రవణ్ సాయి అలియాస్ శివ(20) స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు. అయితే ప్రస్తుతం అతడు కుత్బుల్లాపూర్ లో అద్దె రూమ్ లో నివాసం ఉంటున్నాడు. మైసమ్మ గూడలో సెయింట్ పీటర్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. అయితే సంగారెడ్డి జిల్లా బీరంగూడ ఇసుకబావికి చెందిన శ్రీజ (19) తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసిందే. దాంతో పలుమార్లు సాయిని హెచ్చరించారు. కానీ వీరి ప్రేమ వ్యవహారం అలాగే కొనసాగింది. ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న శ్రీజ తల్లిదండ్రులు.. యువకుడికి మాయమాటలు చెప్పారు. పెళ్లి విషయంపై మాట్లాడుకుందామని నమ్మించి తమ ఇంటికి పిలిపించుకున్నారు. ఈ క్రమంలో సాయి వారి ఇంటికి రాగానే శ్రీజ కుటుంబ సభ్యులు అతడిపై ఒక్కసారిగా దాడి చేసి బ్యాటుతో కొట్టి హత్య చేశారు. ఇక సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications